తెలుగు లో వరుసగా తనదైన కామెడీ మార్క్ చాటుకుంటున్నాడు ప్రియదర్శి. ఆ మద్య మల్లేశం అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు.  తెలంగాణ యాసతో అర్జున్ రెడ్డి నటించిన పెళ్లి చూపులు సినిమాలో నటించిన ప్రియదర్శి ఆ తర్వాత వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు.  తాజాగా రాథా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఓ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఈ మూవీ కోసం నిన్నటి వరకు జార్జియాలో ఉన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నిన్న రాథాకృష్ణ నిజంగా మా టీమ్ చాలా గొప్పదని ప్రశంసించారు.  కరోనా అన్న భయం లేకుండా అందరం హ్యాపీగా షూటింగ్ పూర్తి చేసుకున్నాం అన్నారు. 

 

తాాజాగా ప్రియదర్శి హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షల అనంతరం నేరుగా ఇంటికి చేరుకున్న ప్రియదర్శి 14 రోజులపాటు బయటకు రాకూడదని నిర్ణయించుకున్నాడు.  ప్రస్తుతం భారత దేశంలో కరోనా విస్తరిస్తుంది. కరోనా భయం దయాదాక్షిణ్యాలను కూడా దూరం చేస్తోంది. . విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా వైరస్ సోకే ఉంటుందన్న అనుమానంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అపార్ట్‌మెంట్ వాసులు వారిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. 

 

ముఖ్యంగా కరోనా విదేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువ వస్తుందని.. వారి ద్వారా విస్తరిస్తుందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో ప్రియదర్శి ప్రస్తుతం తనను తాను హౌజ్ అరెస్ట్ చేసుకున్నారు.  కరోనా టాక్ బయట నుంచి ఎప్పుడైతే రాదో అప్పుడు ప్రశాంతంగా బయట తిరుగుతా అంటున్నాడు. తనకు తాను క్లీన్‌చిట్ ఇచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. వైద్యుల సూచన మేరకు 14 రోజులపాటు స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నట్టు తెలిపాడు. ప్రియదర్శి నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఏద ఏమైనా విదేశాలకు వెళ్లి వచ్చిన వారి విషయంలో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: