బుల్లి తెర ఆర్టిస్ట్గా పరిచయమై ఇప్పుడు వెండి తెర కమెడియన్గా కెరియర్ని కొనసాగిస్తున్న వారిలో ధన్రాజ్ ఒకరు. సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం మంచి మంచి అవకాశాలను అందుకుంటూ మంచి రేంజ్లో ఉన్నాడనే చెప్పాలి. మరి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎంతో మంచి కొత్త ఆర్టిస్ట్లను తయారు చేసిన విషయం తెలిసిందే. ఎంతో మంది కొత్తవారు ఆ ప్రోగ్రామ్ నుంచి ఫేమస్ అయినవారు వారి విషయాలు ఏమిటన్నది తెలుసుకుందాం. అలాగే చాలా కాలం నుంచి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు సడెన్గా కొత్తప్రోగ్రామ్కి వెళ్ళి పోవడం అంతేకాక కమెడియన్లు కూడా అటు ఇటు షిఫ్ట్ అవ్వడం పై తాజాగా కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధన్రాజ్ స్పందించారు.
అవేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం... జగడం, పరుగు, గోపీ గోపిక గోదావరి, భీమిలి కబడ్డీ, పిల్లా జమీందార్ వంటి సినిమాలతో అప్పటికే ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ధన్రాజ్. మేనేజర్ ఏడుకొండలు తమను కలిసి ఓ కాన్సెప్ట్ చెప్పాడని తెలిపాడు. అయితే చంద్ర, రోలర్ రఘు, వేణును తానే ఒప్పించానని, రెమ్యూనరేషన్ కూడా తానే మాట్లాడానని పేర్కొన్నాడు. అలా జబర్దస్త్ ప్రోగ్రామ్ మొదలైందని తెలిపారు. అయితే ఆయన చెప్పినప్పుడే మొదటగా పదమూడు ఎపిసోడ్లు చెప్పారని అన్నారు. అయితే మొదటి సారి ఆ ప్రోగ్రామ్ మొదలైంది తనమీదే అని అన్నారు. ఫస్ట్ స్కిట్ కూడా తనదేనని, విన్నర్ కూడా తానేనని తెలిపాడు. ఆ ఒక్క క్రెడిట్ అనేది ఎప్పటికీ నిలిచిపోతుందని ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు.
అయితే మధ్యలో కొన్ని సినిమాల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నప్పటికి చేస్తూ ఉన్నాము అన్నారు ఓ సారి జబర్దస్త్ ఫస్ట్ డైరెక్టర్ సంజయ్, ఏడుకొండలు అనుకోకుండా బయటకు వచ్చేశారు. వారితో కలిసి అప్పుడే మొదలైన ఆలీ టాకీస్ షో చేశామని తెలిపాడు. ఇదే విషయాన్ని శ్యామ్ ప్రసాద్ కూతురు దీప్తికి చెప్పామన్నాడు. అదే సమయంలో అప్పటి వరకు తమ వద్ద కంటెస్టెంట్లుగా ఉన్నవారు సడెన్గా సుధీర్, రాకేష్, గెటప్ శీను ఇలా టీమ్ లీడర్స్ అయ్యారు.. మళ్లీ తాము వెళ్లి అడిగితే...కరెక్ట్ కాదని ఊరుకున్నామన్నారు.
ఆ తర్వాత మొదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ పరిస్థితి కూడా దాదాపు అంతే ఉన్నవారిని తీసెయ్యలేమన్నారు. ఆ తర్వాత మళ్ళీ నాగబాబు, నితిన్ బయటకు వచ్చారని తెలిసింది. ఆయన బయటకు రాగానే ముందు మాకే కాల్ చేసి అదిరించి షో చేయమని అడిగారు. ఇక జబర్దస్త్ ఉన్న వాళ్ళు ఇంత పైకి రావడానికి ప్రధానకారణం నాగబాబు అని చెప్పారు. ఆ విధంగా ఆ షోకి చెయ్యడం జరుగుతుంది.