అప్పట్లో టాలీవుడ్ నటుడు శోభన్ బాబు సినిమా అవకాశాల కోసం సైకిల్ మీద తిరుగుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవారు. ఆయన సైకిల్ మీద వచ్చినప్పటికీ మంచిగా ఇస్త్రీ చేసిన బట్టలు తొడుక్కుని ఆడిషన్స్ కి వెళ్లే వారు. ఆడపడుచు, పుణ్యవతి, కళ్యాణ మండపం సినిమాల్లో నటించిన తర్వాత తనకి చిన్నపాటి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మానవుడు దానవుడు సినిమాలో నటించి విపరీతమైన హీరోయిజాన్ని సంపాదించుకున్నారు.




ఆ తరువాత సోగ్గాడు సినిమాలో నటించి అందాల నటుడిగా ఆంధ్ర రాష్ట్రంలో బిరుదుని పొందారు. ఐతే ఆ కాలంలో శోభన్ బాబు కి ఆడవారి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉండేది. అందుకు కారణం అతని అందంతో పాటు అతను చూపించే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పుకోవచ్చు. నిజానికి శోభన్ బాబు కామెడీని బాగా ఇష్టపడతారు. అందుకే తన సినిమాల్లోని అనేకమైన సన్నివేశాలకి ఒక క్యూట్ నువ్వు పుట్టించే లుక్ ఇచ్చి ముగించేవారు. ఐతే ఇది ఆడవాళ్ళకి బాగా నచ్చేది. దీంతో అతనికి ఆడవాళ్ళ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అలానే ఆడవారిని ఎలా ఆకర్షించాలో కూడా శోభన్ బాబు కి బాగా తెలుసు.



ఇకపోతే మధుసూదన్ రావు శోభన్ బాబు కి బాగా సాయం చేసారని చెప్పుకోవచ్చు. మధుసూదన్ రావు కి చాలా కోపం ఉన్నప్పటికీ శోభన్ బాబు ని మాత్రం సొంత కొడుకులా ట్రీట్ చేసి అతన్ని హీరోగా తీర్చిదిద్దాడు. ఒకానొక సమయంలో అక్కినేని నాగేశ్వరరావుకి ఆరోగ్యం బాగోలేక తను చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లి పోయాడు. ఐతే ఆ సమయంలో ఏఎన్ఆర్ తో సినిమాలు తీసే జగపతి సంస్థ, రామానాయుడు సంస్థ శోభన్ బాబు ని తమ సినిమాల్లో హీరోగా తీసుకొని ఎన్నో చిత్రాలను తెరకెక్కించాయి. అయితే చికిత్స అనంతరం భారతదేశానికి వచ్చిన ఏఎన్ఆర్ ఇది తెలుసుకొని శోభన్ బాబు తో గొడవ పడ్డారు. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఏది ఏమైనా ఎన్నో రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన శోభన్ బాబు తరతరాలుగా అభిమానుల గుండెల్లో ఉండిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: