జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో ఆది ఒకటి. అతని కెరీర్ కి బలమైన పునాది వేసిన సినిమా అది. ఆ సినిమా తర్వాత జూనియర్ వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఆ విధంగా ఆ సినిమా అతని కెరీర్ లో చాలా ప్లస్ అయింది అనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాతే అతని మీద అగ్ర దర్శకుల కన్ను పడింది. అగ్ర నిర్మాతలు కూడా అతనితో సినిమా చేయడానికి ముందుకి వచ్చే వారు. ఆ విధంగా ఆ సినిమా ప్రభావం చూపించింది అనే చెప్పుకోవచ్చు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళ అవకాశాలు కనపడుతున్నాయి. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఆది సినిమాను డైరెక్ట్ చేసిన వీవి వినాయక్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. 

 

వీవి వినాయక్ కూడా అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని నిర్మాతగా ఎవరు ఉంటారు అనేది మాత్రం స్పష్టత లేదు. ముందు జూనియర్ ఎన్టీఆర్ కథ విన్న తర్వాత అప్పుడు నిర్మాత ఎవరు అనేది ఫైనల్ అవుతుందని అంటున్నారు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ కలిసి ఈ సినిమా గురించి చర్చలు జరిపే అవకాశం ఉందనే టాక్ వినపడుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ రెండేళ్ళ నుంచి కష్టపడుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: