తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. మొదట ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లో నానితో కలిసి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించి యువతను బాగా ఆకర్షించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీతగోవిందం తో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. అంటే విజయ్ కి ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.

 

 

 కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన ఆటిట్యూడ్... యువతను ఆకర్షించే మాటలతో బాగా క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం యూత్ ఐకాన్ గా మారిపోయాడు రౌడీ హీరో. అయితే యూత్ లో విజయ్ కు ఎంత క్రేజ్ ఉందో తాజాగా మరోసారి బయటపడింది. 2018లో హైదరాబాద్ టైమ్స్  విడుదల చేసిన మోస్ట్ డిజైరబుల్ మెన్  జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు విజయ్ దేవరకొండ. ఇక 2019 సంవత్సరానికి గాను హైదరాబాద్ టైమ్స్  విడుదల చేసిన జాబితాలో తన స్థానం  నిలబెట్టుకున్నాడు. మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ క్రేజ్ మాత్రం యూత్ లో  ఎక్కడా తగ్గలేదు అని మరోసారి నిరూపితమైంది. 

 

 

 ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ టైమ్స్ విడుదల చేసిన   మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో మొదటి స్థానంలో నిలవగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండవ స్థానంలో నిలిచాడు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 2 వ స్థానానికి చేరుకున్నాడు  రామ్ చరణ్. ఇక మూడు నాలుగు స్థానాల్లో వరుసగా ఎనేర్జిటిక్  స్టార్ రామ్, రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. అయితే గత ఏడాది రెండవ స్థానంలో నిలిచిన ప్రభాస్ ఈ ఏడాది నాలుగవ స్థానానికి పడిపోయాడు. ఇక టాప్ టెన్ లో మెగా హీరో వరుణ్ తేజ్, సుధీర్ బాబు, యాంకర్ ప్రదీప్ ఉన్నారు. ఇక యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ జాబితాలో 19వ స్థానం దక్కడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: