నిర్మాత వడ్డే రమేష్ తనయుడు నవీన్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సినిమా నవీన్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ త‌ర్వాత మనసిచ్చి చూడు, చాలా బాగుంది, నా హృదయంలో నిదురించే చెలి లాంటి చిత్రాలతో నటుడిగా మ‌రియు ల‌వ‌ర్ బాయ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకున్నాడు. అయితే ఆతర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా అల‌రించ‌లేక‌పోయాయి. దీంతో సినిమాల ఎంపికలో సరిగ్గా వ్యవహరించకపోవడం దీనికి కారణమని కొందరంటే, ప్రేమ పెళ్ళికారణంని మరికొందరు అన్నట్టు అప్ప‌ట్లో పుకార్లు షికార్లు కొట్టాయి.

 

అయితే చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. అప్ప‌ట్లో న‌వీన్ ల‌వ‌ర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. మ‌రియు అప్ప‌ట్లో ఈయ‌న‌కు మంచి క్రేజ్ కూడా ఉండేది. ఇక త‌ర్వాత త‌ర్వాత సినిమా విష‌యంలో స‌క్సెస్ కాలేక‌పోయాడు. చేతిలో నిర్మాణ సంస్థ కూడా ఉంది కాబ‌ట్టి, కొన్నాళ్లు బండి లాక్కొచ్చాడు. ఈయ‌న చివరి చిత్రం శ్రీమతి కళ్యాణం. ఆతర్వాత ఎటాక్ మూవీలో సపోర్టింగ్ రోల్ లో దర్శనం ఇచ్చిన నవీన్ ఆతర్వాత ఎడ్రెస్ లేకుండా పోయాడు.  మొత్తానికి ఇండస్ట్రీ నుంచి నెమ్మదిగా దూరమయ్యాడు. ప్ర‌స్తుతం వ‌డ్డే న‌వీన్  సినిమాలతో పని లేకుండా సొంత వ్యాపారలతో బిజీ అయిపోయాడు. 

 

మ‌రియు మాజీ సీఎం ,నటరత్న ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూతురిని నవీన్ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే ఏవేవో కార‌ణాల వ‌ల్ల వీళ్లు విడిపోయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇటీవ‌ల నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు. మ‌రియు ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఏదైతేనేం.. ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బాయ్‌గా క్రేజ్ సంపాధించుకున్న న‌వీన్ ఇప్పుడు వ్యాపార‌వేత్త‌గా సెటిల్ అయ్యాడ‌న్న‌మాట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: