టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు మురుగదాస్. ఆయన ఏ సినిమా తీసినా అందులో మంచి మెసేజ్ ఉండటం చూస్తూనే ఉన్నాం.  మురుగదాస్ తీసే సినిమాలు కూడా కొన్ని కాంట్రవర్సీలుకు గురి అవుతున్నాయి. ఇక మురుగదాస్ డైరెక్షన్ అంటే ఎవరైనా హీరో వెంటనే ఒప్పుకుంటారు.. ఎందుకంటే ఆయన తీసే సినిమాల్లో హీరోయిజంతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుందన్న విషయం తెలిసిందే.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘దర్భార్’ మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు, తమిళంలో మంచి హిట్ టాక్ వచ్చినప్పటికీ పెట్టుబడులు రాబట్టలేక పోయిందని కామెంట్స్ వినిపించాయి. అంతే కాదు బయ్యర్లు కూడా మురుగదాస్ పై ఆగ్రహించినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.

 

ఇక మురుగదాస్-విజయ్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వంలో గతంలో విజయ్ కత్తి, తుపాకి, సర్కార్ మూవీల్లో నటించాడు.  ఈ మూడు మూవీస్ బ్లాక్ బస్టర్ అయ్యాయి.  అంతే కాదు  వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం. ఈ మద్య మురుగదాస్ ఒక కథను విజయ్ కి వినిపించడం .. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందట. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు.  

 

అయితే మురుదాస్ ‘దర్భార్’ విషయంలో తన మార్క్ చాటుకోలేక పోయారని విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే.  అయితే మురుగదాస్ విషయంలో హీరో విజయ్ కి ఎంతో నమ్మకం ఉంది.. అందుకే ఆయన కొత్త మూవీకి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.  మరి ఈ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ మూవీలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఈ మద్య ప్రి రిలీజ్ ఫంక్షన్ కూడా చాలా సైలెంట్ గా చేశారు. దానికి కారణం కరోనా వైరస్ ఎఫెక్ట్ అని.. అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: