తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజా గా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ ఆ మద్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మనోడి బ్యాడ్ టైమ్ మామూలుగా లేదు.. నటించిన నాలుగు చిత్రాలు ఘోర పరాజయం పొందాయి. ఈ ఏడాది ఐవీ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినా.. ఆడియన్స్ మాత్రం పెద్దగా రిసీవ్ చేసుకోలేకపోయారు. దాంతో ఈ చిత్రం కూాడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా రవితేజ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన మూడు చిత్రాలను లైన్లో పెట్టినట్లు సమాచారం.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన 'క్రాక్' చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. గతంలో ఆమె రవితేజతో కలిసి 'బలుపు' సినిమా చేసింది. ఆ తరువాత సినిమాను ఆయన నక్కిన త్రినాథరావు దర్శత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో తమన్నా .. రవితేజ జోడీ కడుతోంది. గతంలో ఆమె 'బెంగాల్ టైగర్' సినిమాలో రవితేజతో కలిసి నటించింది. ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలోను రవితేజ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకుంటున్నట్లు సమాచారం.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేల టిక్కెట్టు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇలా రవితేజ వరుసగా హీరోయిన్స్ ను రిపీట్ చేస్తుండటం విశేషం. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో రవితేజ చేయనున్న చిత్రం, కథానాయికగా ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి. ఆ మద్య అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ చిత్రంతో ఫ్లాప్ పొందిన దర్శకుడు వక్కంతం ఇప్పుడు రవితేజకు ఎంత వరకు హిట్ ఇస్తాడో చూాడాలి.