ప్రభాస్ అంటే ఆడపిల్లలకు కలలరాకుమారుడు అని చెప్పాలి. ప్రభాస్ అంటే చాలు అసలు ఇస్టపడని వారే ఉండరు. ఇక ఇప్పుడైతే ఏకంగా ప్యాన్ ఇండియా హీరో కాబట్టి ప్రపంచమంతా ప్రభాస్కి ఫ్యాన్సే. ఈ విషయం పక్కన పెడితే. ప్రభాస్ ని అందరూ మొదటి చిత్రం నుంచి కూడా లవర్ బాయ్గానే చూస్తారు. ఆయన నటించిన ఈశ్వర్, అడవిరాముడు, పౌర్ణమి ఇవన్నీ ఒక ఎత్తైతే... త్రిషతో నటించిన వర్షం చిత్రం ఒక ఎత్తు అని చెప్పాలి. ఆ చిత్రంతో ప్రభాస్ కి లేడీస్ ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారని చెప్పాలి. అయితే బేసిక్గా ప్రభాస్కి చాలా మొహమాటం సిగ్గు ఎక్కువట. ఆయన ఆన్ స్క్రీన్ రొమాన్స్ వరకు ఓకేగాని ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా సైలెంట్ ఉంటారట.
ఇక ప్రభాస్ చిత్రాల్లో సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అయితే అందరితో చాలా తక్కువగా మాట్లాడేవారట. అలాగే రొమాంటిక్ సీన్స్లో కూడా ఆయన చాలా ఇబ్బంది పడేవారట. ఆ సీన్లు చెయ్యాలంటేనే అతి కష్టంగా ఫీలయ్యేవారంట. షాట్ అయిపోగానే మళ్ళీ వెళ్లి సైలెంట్గా కూర్చునేవారట. ఆఫ్ స్క్రీన్లో హీరోయిన్లతో మాట్లాడటం జోక్స్ అసలు ఇవేమి చేసేవారు కాదట. అలాగే ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్లో కూడా ఆయన స్పీచ్ ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు మొహమాటం చాలా ఎక్కువ సిగ్గు మొహమాటం వల్ల త్వరగా అందరితో కలివిడిగా ఉండలేకపోయేవారట.
మరి ఈ లవర్బాయ్ రొమాన్స్ ఆన్ స్క్రీన్ మీదే ఓకే కాని ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఉండదట. ఇక ఇప్పుడు బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడున్న క్రేజ్ అయితే మాములుకాదు. అయితే ఇప్పుడు ప్రభాస్ లో కూడా కాస్త మార్పు వచ్చింది. ఇదివరకులా ఆయన లేరు. కొంచం పబ్లిక్ ఫంక్షన్స్లో మాట్లాడుతున్నారు. కాంత వరకు మేలనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.