అభిమానులకు చిన్న, పెద్ద హీరో అంటూ తేడాలు ఉండవు. వారు అభిమానించే హీరో గురించి చిన్న వార్త వచ్చిన ఫాన్స్ కి ఎదో తెలియని అందం వచ్చేస్తుంది. అలాంటి మన రెబల్ స్టార్ గురించి చిన్న వార్త అయినా అభిమానులకు సందడే సందడి. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న ఒక్క ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రభాస్ ఫాన్స్ కి మరింత జోష్ నింపుతుంది. ఇది ప్రభాస్ నటిస్తున్నా 20వ చిత్రం. 

 

బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ స్థాయికి తెలుగు పరిశ్రమను తీసుకెళ్లిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్  ‘సాహో’ తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాకు ‘జాన్’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. 

 

కరోనా ఎఫెక్ట్ తట్టుకుని మరీ చిత్ర బృందం జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుని తాజాగా హైదరాబాద్ తిరిగొచ్చింది. టీమ్ ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్న ఫోటో షేర్ చేస్తూ.. ‘’జార్జియాలో మరో షెడ్యూల్‌ పూర్తయింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా చిత్రీకరణ పూర్తి చేయడంలో మాకు సహాయ సహకరాలు అందించిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ త్వరలో విడుదల అవుతుందని యువీ క్రియేషన్స్‌ తెలిపింది. 

 

కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని పరిస్థితులను బట్టి తదుపరి షెడ్యూల్ వివరాలు వెల్లడిస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా సాహో చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రభాస్ కి తన నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉగాది కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయని సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: