ఎక్కడ నుంచో వస్తారు. ఎక్కడికో ఎగిరిపోతారు. వచ్చిన స్టార్ డం అంతా వేరే చోటకు నిచ్చేనలా యూజ్ చేసుకుంటారు. ఈ హీరోయిన తీరే అంత. వారి చూపు ఎపుడూ బాలీవుడ్ మీదనే ఉంటుంది. జాతీయ స్థాయి ఇమేజ్. ఆ హవా వారికి ఒక టార్గెట్ గా ఉంటుంది.

 

ఇపుడు పూజా హెగ్డే చూస్తూంటే మళ్ళీ బాలీవుడ్లో లక్ చెక్ చేసుకోవాలనుకుంటోందిట. ఈ అమ్మడు అల వైకుంఠపురంలో అల్లు అర్జున సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత వరసలో జూనియర్ ఎన్టీయార్ మూవీ లో త్రివిక్రం డైరెక్షన్లో కొత్త సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది.

 

ఇక మరో వైపు డార్లింగ్ ప్రభాస్ పక్కన జాన్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలు ఇలా ఉండగానే పూజా హెగ్డే బాలీవుడ్లోకి ఎగరాలనుకుంటోంది. లేటెస్ట్ గా  ఆమె అక్కడ స్టార్ హీరో అక్షయ్ కుమర్ పక్కన ఓ మూవీలో లక్కీ చాన్స్ కొట్టేసింది. అక్కడ అక్షయ్ హవా ఓ రేంజిలో ఉంది. ఆయన పక్కన నటించి హిట్ అయితే ఇక స్టార్ డమ్ కి తిరుగుండదని  పూజా లెక్కలు బాగానే వేసుకుంటోంది.

 

మరి పూజా చూపు బాలీవుడ్లో ఉండడంతో ఇక టాలీవుడ్లో నటించదని కూడా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. త్రివిక్రం మూవీతో ఆమె ఆపేస్తుందని అంటున్నారు. ఆమె హిందీ సినిమాలవైపు ఆసక్తిగా ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆమె వెనకనే ఉన్న  రష్మికకు మంచి చాన్స్ గా చెప్పుకోవాలి. పూజా హెగ్డే బాలీవుడ్ అంటూ కలవరించడం వల్ల మిగిలిన వారు ముందు వరసలోకి వస్తారు.

 

ఇక తన ఎంట్రీ మూవీ మొహంజదారో  మూవీలో నటించింది. అది అట్టర్ ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ గా అక్కడ ముద్ర వేసుకుంది. అటువంటి పూజాని టాలీవుడ్ బాగా  ఆదరించింది. ఇపుడు ఆమె తిరుగులేని ఇమేజ్ తో  ఉంది. ఈ టైంలో మరిన్ని సినిమాలు ఇక్కడే చేస్తే కెరీర్ పదిలంగా ఉంటుందని సలహా ఇచ్చేవారూ ఉన్నారు. కానీ పూజామాత్రం బాలీవుడ్లో పాగా వేయాల్సిందే అంటోందిట. మరి ఆమె రెండవమారు అక్కడ లక్కుకు  టెస్ట్ పెడుతోంది. అది ఎలా ఉంటుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: