ప్రిన్స్ మహేశ్ బాబును సూపర్ స్టార్ మహేశ్ గా మార్చేసిన సినిమా పోకిరి. పూరి జగన్నాధ్ చేసిన మ్యాజిక్ కు ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. రెండోసారి పూరి జగన్నాధ్ తో చేసిన బిజినెస్ మ్యాన్ కూడా ఎబౌ యావరేజ్ అనిపించుకుంది. వీరిద్దరి కాంబినేషన్ తీసుకొచ్చిన క్రేజే ఆ సినిమాను నిలబెట్టింది. తర్వాత వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఒకరి గురించి మరొకరు ప్రస్తావించలేని పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి మధ్య గ్యాప్ తగ్గించేందుకు మహేశ్ భార్య నమ్రత పావులు కదుపుతోందని ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది.

 

 

 

పూరిని ఒప్పించి ఓ మాస్ ఎంటర్ టైనర్ చేయించాలని నమ్రత ప్లాన్ చేస్తోందట. శ్రీమంతుడు నుంచి మహేశ్ అన్నీ సీరియస్ రోల్సే చేస్తున్నాడు కానీ.. మాస్ ఎంటర్ టైనర్ చేయట్లేదు. ఆ టైప్ కథలే మహేశ్ దగ్గరికి రావడం లేదట. సరిలేరు.. చేసినా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. వన్ మ్యాన్ షో లాంటి సినిమా పడాలంటే పూరి వల్లే అవుతుందని నమ్రత భావిస్తోందట. దీనికి మహేశ్ ఓకే అన్నాడా.. అసలు ఈ వార్తలో నిజముందా లేదా అనేదానిపై క్లారిటీ లేకపోయినా ఫిలింనగర్లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

 

 

 

మహేశ్ హీరోగా జణగణమణ చేస్తున్నానని పూరి అన్నాడు కూడా. కానీ మహేశ్ పూరి వంక చూడలేదు. పూరి కూడా ఫ్లాప్స్ లోకి వెళ్లిపోయాడు. హిట్ ఇచ్చిన దర్శకులతోనే మహేశ్ సినిమా చేస్తాడనే ఓ గాసిప్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ విజయోత్సవంలో ఇదే విషయాన్ని పూరి బాహాటంగానే చెప్పేశాడు. మహర్షి ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పూరి మహేశ్ పూరి పేరు చెప్పలేదు. మరి ఈ గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా అనేది కొన్నాళ్లు ఆగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: