ప్రభాస్ హీరోగా "మిర్చి" లాంటి సూపర్డూపర్ హిట్ని అందించిన వంశి, ప్రమోద్లు నిర్మిస్తున్న యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్స్ సినిమాకు"రన్ రాజా రన్" అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ చిత్రంలో శర్వానంద్, సీరత్ కపూర్లు హీరోహీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రం లవ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది అని సమాచారం. ఈసినిమా ద్వారా సుజీత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
"మిర్చి" లాంటి సూపర్ హిట్కి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన మధి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నాడు. "విశ్వరూపం - 2" చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఘిబ్రాన్.యమ్ సంగీతాన్ని అందిస్తున్నారు అందించాడట. ప్రస్తుతం గోవా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోoది. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది చెపుతున్నారు.
దీని కోసం ఏ టైటిల్ పెట్టాలా అని ఆలోచిస్తున్న టైంలో యూనిట్ వారు కన్ఫార్మ్ చేసిన టైటిల్ "రన్ రాజా రన్" అని అంటున్నారు. ప్రస్తుతం ట్రెండీగా వుండే టైటిల్స్ తో సినిమాలు వస్తే విజయవంతం అవుతున్నాయి కాబట్టి ఈ టైటిల్ పెట్టాము అని అంటున్నారు నిర్మాతలు
శర్వానంద్ కెరియర్ కు బ్రేక్ ఇస్తుంది అని అందరు ఉహించుకున్న రామ్ గోపాల్ వర్మ ‘సత్యా 2’ పరాజయం చెందడంతో ప్రభాస్ కు హిట్ ఇచ్చిన బ్యానర్ తనకు కలిసి వస్తుందని గంపెడు ఆశతో ఉన్నాడు సర్వా.
మరింత సమాచారం తెలుసుకోండి: