సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత అసలైతే వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది. వంశీ సినిమా కన్ఫర్మ్ చేసి అతనికి ఆశలు కలిగించి చివరకు స్టోరీలో దమ్ము లేదని హ్యాండ్ ఇచ్చాడు మహేష్. మహేష్ సినిమా మీద నమ్మకం పెట్టుకున్న వంశీ పైడిపల్లి ఇప్పుడు మహేష్ ఆఫర్ మిస్సయ్యే సరికి ఢీలా పడ్డాడు. అయితే చివరి నిమిషంలో మహేష్ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. అతనే సోలమన్. 

 

వంశీ దగ్గర అసోషియేట్ రైటర్ గా ఉంటూ వస్తున్నా సోలమన్ ఇప్పుడు సొంతంగా డైరక్టర్ గా మారాడు. కింగ్ నాగార్జునతో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు సోలమన్. వంశీ, మహేష్ మూవీ క్యాన్సిల్ అవడంలో అతను పరోక్ష కారణం అంటున్నారు. అదెలా అంటే వంశీ ప్రతి సినిమాకు సోలామాన్ బ్యాక్ బోన్ గా ఉంటూ వస్తున్నాడు. అతని రైటింగ్ స్కిల్స్ వంశీ సినిమాలకు చాలా హెల్ప్ అయ్యాయి. మహేష్, వంశీ చేసిన మహర్షి సినిమాకు కూడా సోలమన్ రైటింగ్ బాగా కుదిరింది. 

 

అయితే లేటెస్ట్ గా మహేష్ కు చెప్పిన కథలో సెకండ్ హాఫ్ కొద్దిగా వీక్ గా ఉందట. అందుకే వంశీ సినిమాను పక్కన పెట్టాడు మహేష్. సోలమాన్ ఉంటే ఆ ట్రీట్మెంట్ బాగా ఉండేదని. అతను బయటకు వెళ్లడం వల్లే సినిమా ఆఫర్ మిస్ అయ్యిందని అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ వంశీ మూవీ క్యాన్సిల్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వంశీ పైడిపల్లిని కాదని పరాజుమ్రా డైరక్షన్ లో మహేష్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఉగాది రోజున ఈ సినిమా ముహూర్తం అంటున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వల్ల సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ చేశారు. మరి ముహూర్తం కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: