మెగా కాంపౌండ్ కు కొరటాల కు గతంలో కూడ కలిసి రాలేదు. గతంలో రామ్ చరణ్ తో ఒక సినిమా ప్రారంభోత్సవం కూడ జరుపుకుని చరణ్ కొరటాల మధ్య కొన్ని అనుకోని భేదాభిప్రాయాలు ఏర్పడటంతో ఆ మూవీ ఆగిపోయింది. ఆ తరువాత కొరటాల మహేష్ తో రెండు సూపర్ హిట్ సినిమాలు తీయడంతో మహేష్ కొరటాల శివ లమధ్య ఇప్పటికీ విడదీయరాని సాన్నిహిత్యం కొనసాగుతోంది. 


ఇప్పుడు ఆ సాన్నిహిత్యమే చిరంజీవి కొరటాల మధ్య గ్యాప్ పెంచిందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి గాసిప్పులు రావడానికి ఒక ఆసక్తిగల కారణం వినిపిస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆచార్య’ మూవీకి సంబంధించి వర్క్ కేవలం కొద్ది మాత్రమే పూర్తి అయింది అని అంటున్నారు. 


ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ఇంకా చాల పెండింగ్ లో ఉన్నట్లు టాక్. రామ్ చరణ్ పార్ట్ అలాగే పెండింగ్ లో కొనసాగుతూ ఉంటే హీరోయిన్ పై ఇంకా ఒక్క సీన్ కూడ చిత్రీకరించలేదు అని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో చరణ్ విషయంలో కొనసాగుతున్న అయోమయం వల్ల ఆగిపోయిన ‘ఆచార్య’ ను పరుగులు పెట్టించాలని మహేష్ ను చరణ్ పాత్రలోకి ఎంపిక చేసే విషయంలో చిరంజీవికి తెలియకుండా కొరటాల మహేష్ తో రాయబారాలు చేసినట్లు టాక్. 


ఈ విషయం ఆలస్యంగా చిరంజీవి దృష్టికి రావడంతో తనకు తెలియకుండా మహేష్ ను ఎందుకు కలిసిసావు అంటూ చిరంజీవి కొరటాలను కార్నర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అనుకోని ప్రశ్నకు షాక్ అయిన కొరటాల సమాధానం ఇస్తూ అసలు మహేష్ ఈ మూవీలో స్పెషల్ పాత్రను చేయడానికి అంగీకరిస్తాడో లేదో తెలుసుకోవడానికి మాత్రమే తాను మహేష్ కలిసానని ఇందులో ఎటువంటి వేరే ఉద్దేశ్యం లేదు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగినప్పటి నుండి చిరంజీవి కొరటాల మధ్య బయటపడని చిన్న గ్యాప్ ఏర్పడిందని ఇప్పుడు త్రిషమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో చిరంజీవి  ఎవర్ని ఫిక్స్ చేస్తే ఆమెను హీరోయిన్ గా తీసుకుంటానని తనకు వ్యక్తిగత అభిప్రాయాలు లేవు అంటూ కొరటాల చిరంజీవికి షాక్ ఇచ్చినట్లు గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈ విషయాలు అన్నీ చరణ్ దృష్టి వరకు రావడంతో ప్రస్తుతం షూటింగ్ లు లేకుండా ఏర్పడిన గ్యాప్ ను చిరంజీవి కొరటా శివల మధ్య ఏర్పడ్డ ఈ సున్నితమైన గ్యాప్ ను పరిష్కరించి తిరిగి షూటింగ్ లు మొదలు కాగానే ‘ఆచార్య’ ను పరుగులు తీయించాలని చరణ్ ఈ విషయాలపై శ్రద్ధ పెట్టాడు అంటూ గాసిప్పులు గుప్పుమంటున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: