సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇప్పుడు తిరుగులేని స్టార్ హీరోగా ఉన్నాడు. పోకిరి, ఆ త‌ర్వాత వ‌చ్చిన దూకుడు, శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సినిమాలు మ‌హేష్‌కు తిరుగులేని క్రేజ్ తీసుకు వ‌చ్చాయి. అయితే ఈ సినిమాల క‌న్నా మ‌హేష్‌కు క్రేజ్ తీసుకు వ‌చ్చి... అత‌డిని స్టామినా ఏంటో చెప్పిన సినిమా ఖ‌చ్చితంగా ఒక్క‌డే. రాజ‌కుమారుడు సినిమాతో హీరో అయిన మ‌హేష్‌కు ఆ సినిమా హిట్ అయినా  ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్ రేంజ్‌కు త‌గ్గ సినిమా అయితే ప‌డ‌లేదు.



ఆ త‌ర్వాత వంశీ, బాబి లాంటి సినిమాలు ఘోరంగా త‌న్నేయ‌డంతో మ‌హేష్ పూర్తిగా డిజ‌ప్పాయింట్ అయ్యాడు. అయితే 2003లో సంక్రాంతి కానుక‌గా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఒక్క‌డు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఆ రోజుల్లోనే ఏకంగా 130 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా డైరెక్టుగా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌గా రెండు రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయిన మ‌రో 30 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ త‌ర్వాత మూడో రిలీజ్‌లో వారం రోజుల త‌ర్వాత రిలీజ్ అయిన మ‌రో ప‌ది కేంద్రాల్లో కూడా 100 రోజులు ఆడింది.



సుమంత్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఎంఎస్‌. రాజు నిర్మించిన ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌హేష్ స‌ర‌స‌న భూమిక హీరోయిన్‌గా నటించారు. ఆ త‌ర్వాత అదే గుణ‌శేఖ‌ర్‌పై ఎంతో న‌మ్మ‌కంతో మ‌హేష్ మ‌రో రెండుసార్లు త‌న సినిమాల‌కు ఛాన్స్ ఇచ్చారు. అర్జున్ సినిమా యావ‌రేజ్ అవ్వ‌గా. సైనికుడు భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఏదేమైనా మ‌హేష్ - గుణ‌శేఖ‌ర్ కాంబినేష‌న్లో ఇప్పుడు సినిమా వ‌చ్చినా భారీ అంచ‌నాలు ఉంటాయి. రుద్ర‌మ‌దేవి సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన గుణ‌శేఖ‌ర్‌కు మ‌ళ్లీ మ‌హేష్‌ను డైరెక్ట్ చేసే అదృష్టం ఉందో ?  లేదో ?

మరింత సమాచారం తెలుసుకోండి: