ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా  భయాలు పాతుకుపోతున్న  విషయం తెలిసిందే. ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు భారతదేశంలో కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండడంతో.. భారత ప్రజలందరూ చిగురుటాకులా వణికిపోతారు. ఎక్కడ కరోనా  తమ వరకు వస్తుందోనని అనుమానంతోనే ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఇప్పటి వరకు భారత దేశ వ్యాప్తంగా 150 కేసు కరోనా పాజిటివ్ కేసులు  నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు లోకి తెస్తున్నాయి. 

 

 

 అయితే ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ ప్రజల్లో  రోజురోజుకు భయాందోళనలు పెంచుతూనే ఉంది. దీంతో దేశం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. ఇక ఈ వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడంతో ప్రజల్లో  మహమ్మారి వైరస్ భయం  మరింతగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ నియంత్రణకు నివారణ ఒక్కటే మార్గం అంటూ అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ప్రజల్లో అవగాహన కల్పించి కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరికీ ధైర్యం కూడా కల్పిస్తున్నారు సినీ సెలబ్రిటీలు. కరోనా  వైరస్ నియంత్రణకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలు వివరిస్తున్నారు. 

 

 

 ఇక ముఖ్యంగా సినీ తారలు అందరూ తమ తమ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ప్రస్తుతం కేవలం ఇళ్లకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ లాంటివారు ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇక బాలీవుడ్ తార ఆలియా భట్... తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఒక పుస్తకం కనిపిస్తోంది. ఆ పుస్తకం పేరు ఇన్ డిఫైనబుల్ నితిన్ సాహ్ని... అనే పుస్తకం ఆలియా భట్ పోస్ట్ చేసిన ఫోటోలో కనిపిస్తుంది... ఇంట్లో ఉంటూ చాలా పుస్తకాలు చదవండి అంటూ దీనికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఆలియా భట్.

మరింత సమాచారం తెలుసుకోండి: