తెలుగు చిత్ర పరిశ్రమలోకి చాలామంది మెగా హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎంట్రీ ఇచ్చిన హీరోలలో  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఏకంగా ప్రేక్షకుల సుప్రీం హీరో గా కూడా మారిపోయాడు, అయితే కెరీర్ మొదట్లో మంచి విజయాలు సాధించి దూసుకుపోయిన సాయి ధరంతేజ్ తర్వాత వరుసగా ఫ్లాప్ లతో సతమతమయ్యాడు.ఎన్ని బిన్నమైన ప్రయత్నాలతో తెరమీదికి వచ్చినప్పటికీ.. సరైన విజయాన్ని మాత్రం సాధించలేకపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సాయి ధరంతేజ్ కెరీర్ ముగిసిపోయింది అని అనుకుంటున్న తరుణంలో.. చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. 

 

 

 చిత్రలహరి సినిమా తో మెగా ఫ్లాపుల హీరో అయిన సాయి ధరమ్ తేజ్ కి కిషోర్ తిరుమల మంచి విజయాన్ని అందించి బూస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి.. చిత్రలహరి సినిమాలో విజయం కోసం ఆరాటపడే యువకుడిగా.. ఎప్పుడు ఫెయిల్యూర్ ను చవి చూసే విసిగి పోయిన ఒక గ్రాడ్యువేట్ గా సాయి ధరంతేజ్ కనిపిస్తాడు. అంతేకాకుండా ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకులను ఆకర్షించాడు సాయి ధరంతేజ్. పెద్దగా గడ్డం పెంచేసి... అదిరిపోయే లుక్ తో ప్రేక్షకులను ఆకర్షించాడు. ఇక వరుస ప్లాపులతో సతమతమైన కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో చిత్రలహరి సినిమాతో మంచి విజయం సాధించాడు. 

 

 

 ఈ సినిమా స్టోరీ సగటు సినీ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోవడంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక చిత్రలహరి తర్వాత మొన్నటికి మొన్న ప్రతి రోజు పండుగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి విజయం సాధించాడు సాయి ధరంతేజ్. ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ని  గాడిలో పెట్టి... మంచి విజయాన్ని అందించే... మరోసారి మెగా హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ ను  పట్టాలు ఎక్కించాడు దర్శకుడు కిషోర్ తిరుమల.

మరింత సమాచారం తెలుసుకోండి: