నిన్న హైదరాబాద్ టైమ్స్ విజయ్ దేవరకొండ ను మెన్స్ కేటగిరిలో మోస్ట్ డిజైరబుల్ వ్యక్తిగా ప్రకటించి ఒకరోజు గడవక ముందే మహేష్ అభిమానులు ఈ ర్యాంకింగ్స్ పై తమ తీవ్ర అభ్యంతరాలను తెలియ చేస్తూ అసహనానికి నోనవుతున్నారు. దీనికి కారణం మహేష్ కు ఈసారి మోస్ట్ డిజైరబుల్ కేటగిరిలో కనీసం ఒక్క ర్యాంక్ కూడ రాకపోవడం.


వరస పరాజయాలతో సతమతమైపోవడమే కాకుండా ప్రస్తుతం హ్యాట్రిక్ ఫెయిల్యూర్ హీరోగా ముద్రపడిన విజయ్ దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ పర్సన్ ఎలా అవుతాడు అంటూ మహేష్ అభిమానులు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అంతేకాదు మరికొందరైతే విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు కనీసం 10 కోట్లు కూడ నెట్ కలక్షన్స్ రాని పరిస్థితులలో హైదరాబాద్ టైమ్స్ విజయ్ కు నెంబర్ వన్ ర్యాంక్ ను ఎలా ఇచ్చింది అంటూ సరికొత్త చర్చను మహేష్ అభిమానులు లేవనెత్తారు. 


అయితే విజయ్ అభిమానులు మాత్రం సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ కి ఇప్పటికీ యూత్ లో కొనసాగుతున్న పాపులారిటీకి హైదరాబాద్ టైమ్స్ సర్వే నిదర్శనం అంటూ విజయ్ అభిమానులు తమ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. వాస్తవానికి నిన్న ప్రకటింపబడ్డ హైదరాబాద్ టైమ్స్ ర్యాంకింగ్స్ లో మహేష్ కు స్థానం లభించక పోవడానికి ఒక కారణం వినిపిస్తోంది. 


మహేష్ ను టైమ్స్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ‘ఫరెవర్ డిజైరబుల్’ లిస్టులో సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ అక్షయ కుమార్ ల స్థాయిలో గుర్తించడంతో మహేష్ ను ఈ మోస్ట్ డిజైరబుల్ లిస్టు నుండి తొలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. కారణాలు ఎలాంటివైనా వరస పరాజయాలతో షాక్ లో ఉన్న విజయ్ దేవరకొండకు నిన్న హైదరాబాద్ టైమ్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్ ఒక పెద్ద బూస్టింగ్ అనుకోవాలి. ఈ ఉత్సాహంతో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ లేటెస్ట్ మూవీ విషయంలో మరింత ఉత్సాహంతో తన స్థాయిని పెంచుకునే అవకాసం కనిపిస్తోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: