రమ్యకృష్ణ కెరీర్ ను ‘బాహుబలి’ కి ముందు ‘బాహుబలి’ తర్వాత అని చెప్పుకునే స్థాయిలో మారిపోయింది. శివగామి పాత్ర రమ్యకృష్ణకు లైఫ్ టైమ్ గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఆమె పేరు తార స్థాయిలో మరుమ్రోగేలా చేసింది. ‘బాహుబలి’ తర్వాత రమ్యకృష్ణ పాత్రల ఎంపిక విధానం కూడ మార్చు కోవడంతో  ఆమె కోసం మేకర్స్ ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారు.   


అయితే రమ్యకృష్ణ ‘బాహుబలి’ తరువాత అనేక సినిమాలో అనేక పాత్రలు చేసినా 
ఆమెకు శివగామి పాత్ర స్థాయిలో నటించే ఒక్క పాత్ర కూడ లభించలేదు. ఇప్పుడు ఆలోటు లేటెస్ట్ గా మొదలైన సాయి ధరమ్ తేజ్ మూవీ తీర్చబోతుందని సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు దేవకట్ట దర్శకత్వంలో సాయి తేజ్ నటిస్తున్న మూవీలో విలన్ పాత్రకు రమ్యకృష్ణ ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈ మూవీలో ఆమె మైండ్ గేమ్ తో చేసే విలనీ చాల డిఫరెంట్ గా ఉంటూ లేడి స్టైలిష్ విలన్ గా రమ్యకృష్ణ పాత్ర ఉండటమే కాకుండా ఈ మూవీకి ఆమె పాత్ర హైలెట్ అవుతుంది అని అంటున్నారు. పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో రమ్యకృష్ణ నటించే ఈ సినిమాతో మళ్ళీ ఆమె హవా మరో స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు.


రమ్యకృష్ణ  నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఫ్లాప్ కావడంతో పాటు ‘హలో’ మూవీలో చేసిన తల్లిపాత్ర పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఆమె తనకు అవకాశాలు వస్తున్నా అన్నీ ఒప్పుకోకుండా జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ అనే సినిమాలో నటిస్తున్న రమ్యకృష్ణ ఇప్పుడు ఇలా లేడీ విలన్ గా సాయి తేజ్ ను ఒక ఆట ఆడుకోవడం ఈ మూవీ స్పెషాలిటీ అని అంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కోసం క్రియేట్ చేయబడ్డ పాత్రలో సాయి తేజ్ నటిస్తున్న పరిస్థితులలో పవన్ కు విలన్ గా మారవలసిన రమ్యకృష్ణ మెగా మేనల్లుడుకి విలన్ గా మారుతోంది అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: