తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్తర్ గా ఎదిగిన దేవిశ్రీ ప్రసాద్ గత కొన్ని రోజులుగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతడు ఇస్తున్న మ్యూజిక్ లో కొత్తదనం లేదనీ పాత ట్యూన్లనే మార్చి మార్చి కొడుతున్నాడని టాక్ వచ్చింది. థమన్ ఏ విధంగా మారాడో దేవి కూడా అలా మారాలని కొత్త ట్యూన్లని వినిపించాలని సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం అలాంటి సలహానే మరోటి ఇస్తున్నారు.

 


ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క గొంతు ఎక్కువగా వినిపిస్తుంది. సింగర్ గా ఆ గొంతు పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. కొన్ని సార్లు అతడు పాడిన పాట వల్లే సినిమాకీ ప్రమోషన్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ పాటికే ఆ సింగర్ ఎవరో అర్థమై ఉంటుంది. అవును  మీరు ఆలోచిస్తున్నది నిజమే.. అతడే సిద్ శ్రీరామ్..

 

సిద్  శ్రీరామ్ ఏ పాట పాడినా అది సూపర్ హిట్టే. ఒక్కోసారి ఒక్కొక్కరిది నడుస్తున్నట్ట్య్ ఇప్పుడు సిద్ శ్రీరామ్ హవా నడుస్తుంది. అందుకే ప్రతీ సినిమాలోను అతడి పాట ఉండేలా చూసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కానీ దేవి శ్రీ ప్రసాద్ మాత్రం అతడిని పట్టించుకోకపోవడం గమనార్హం. అతడి చేత పాటలు పాడిస్తే హిట్ అవుతున్నాయని తెలిసి కూడా ఎందుకు అతడి చేత పాడించట్లేదో అర్థం కావట్లేదు.

 

ఇటీవల ఉప్పెన చిత్రం నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. నీ కన్ను నీలి సముద్రం , ధక్ ధక్ ధక్ అంటూ సాగిన రెండు పాటలు మంచి హిట్ అయ్యాయి. అయినా కూడా మ్యూజిక్ లవర్స్ దేవిని సిద్ శ్రీరామ్ తో పాట పాడించాలని కోరుతున్నారు. మరి దేవి వారి మాట విని సిద్ శ్రీరామ్ తో పాట పాడిస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: