టాలీవుడ్ లో ఎప్పుడు మంచి క్రెజ్ లో ఉన్న హీరోల్లో నితిన్ ఒక్కడు. ప్రస్తుతం భీష్మ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయిని త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడు. ఈ యంగ్  హీరోని  మనకి మొట్టమొదటి సారి పరిచయం చేసిన దర్శకుడు తేజ. ఈయన  దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో నితిన్ హీరోగా  తెరంగేట్రం చేసాడు.తర్వాత దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. 

 

 


అసలు నితిన్ కి సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చిందంటే  ఒక రోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. నితిన్  నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.2002లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. నితిన్ కి మంచి పేరు వచ్చింది. 

 

 

తేజ కి కూడా పలు అవార్డులు తెచ్చిన సినిమా జయం. తేజ గా పిలువబడే ధర్మ తేజ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు మరియు రచయిత.  మొదట ఛాయాగ్రాహకుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దర్శక నిర్మాతగా మారాడు. చిత్రం, జయం, నేనే రాజు మంత్రి ఇలాంటి మంచి విజయవంతమైన సినిమాలు తీసాడు. హీరో నితిన్ తో  దైర్యం అనే సినిమా కూడా తీసాడు. 

 

కానీ ఈ సినిమా అంతటి విజయాన్ని అందుకోలేదు. కానీ తర్వాత నీతిన్ కి తేజకి ఏవో గొడవలు ఉన్నట్లు వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబో లో ఎలాంటి సినిమా రాలేదు. కానీ నితిన్ మాత్రం నాకు తేజనే గురువు అని ఒక ప్రెస్ మీట్ లో తెలిపాడు. ఏది ఏమయినా నితిన్ కి మాత్రం లైఫ్ ఇచ్చింది తేజనే. ప్రస్తుతం తేజ కి కూడా మంచి హిట్స్ లేవు. ఒకానొక టైములో నితిన్ కి కూడా సరయిన విజయం దక్కలేదు. రీసెంట్ గా వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: