టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్లు తమ జోరు పెంచుతున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు రాత్రి రాత్రే స్టార్ హోదా దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పూత్. ఈ మూవీ బోల్డ్ కంటెంట్ తో అప్పట్లో యూత్ ని పిచ్చెక్కించింది. ఇందులో కార్తికేయ, పాయల్ మద్య వచ్చే లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. ఈ మూవీలో పాయల్ ఓ రేంజ్ లో స్కిన్ షో చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'ఆర్డీఎక్స్ లవ్' మూవీలో నటించింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ మద్య వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకిమామలో నటించింది.
తెలుగు లో ఒక్కో ఛాన్సు దక్కించుకుంచుకుంటున్న ఈ హాట్ బ్యూటీకి మరో మంచి అవకాశం వచ్చిందని అంటున్నారు. హీరోయిన్ గా నే కాకుండా ఐటమ్ సాంగ్స్ కి కూడా ఈ బ్యూటీ రెడీ అంటుంది. ఆ మద్య తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ నటించిన ‘సీత’ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ లో హాట్ హాట్ గా కనిపించింది. తాజాగా ఈ బోజ్ పూర్ భామకి నందమూరి బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తాజాగా బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఓ మూవీలో పాయల్ కి ఛాన్స్ వచ్చిందంటున్నారు.
బాలయ్య సరసన ఇప్పటికే శ్రియ - అంజలి పేర్లు వినిపించాయి. కాకపోతే ఈ మూవీలో శ్రియా నటిస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పాయల్ పేరు తెరపైకి వచ్చింది. ఈ అమ్మడు రెమ్యూనేషన్ విషయంలో తక్కువ.. గ్లామరస్ డోస్ ఎక్కువ కనుకనే పాయల్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ మూవీలో ఛాన్స్ దొరికితే.. హిట్ అయితే మాత్రం ఈ బ్యూటీకి తెలుగు లో వరుస ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు ఫిలిమ్ వర్గాలు.