కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఫంక్షన్లు పార్టీల విషయంలో ఆంక్షలు విధించటంతో ప్రముఖుల ఇళ్లలో వేడుకలు వాయిదా పడుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరో నితిన్‌ ఇప్పటికే తన పెళ్లి వేడుకను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్ కపుల్‌ కూడా తమ వివాహ వేడుకను వాయిదా వేశారు.

 

బాలీవుడ్ హీరోయిన రిచా చద్దా, అలి ఫజల్‌ ల వివాహం ఈ ఏడాది ఏప్రిల్ లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారి వివాహం వాయిదా పడినట్టుగా వారి అధికారిక పీఆర్వోలు వెల్లడించారు. `ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో రిచా చద్దా, అలి ఫజల్‌లు తమ వివాహ వేడుకను ఈ ఏడాది చివరకు వాయిదా వేశారు. సన్నిహితులు కుటుంబ సభ్యుల ఆరోగ్య పట్ల శ్రద్ధాతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం` అంటూ వారు ఓ ప్రకటన విడుదల చేశారు.

 

అంతేకాదు మరో స్టార్ కపుల్ వరుణ్ దావన్‌, నటాషా దలాల్‌ ల వివాహం కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. చాలా కాలంగా రిలేషన్‌ షిప్‌లో ఉన్న వరుణ్‌, నటాషాలు ఈ ఏడాది వేసవిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ముందుగా వీరు థాయ్‌ లాండ్‌ లోని ఓ ప్రైవేట్‌ ఐలాండ్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తరువాత ఆ వేడుకను జోద్‌ పూర్‌ కు మార్చారు. అదే సమయంలో కరోనా వార్తలు రావటంతో ముంబైలో కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చేయిదాటిపోవటంతో పూర్తి వివాహాన్ని వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది నవంబర్‌ లో రిచా, అలీ లా వివాహం థాయ్‌ లాండ్‌లోనే జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: