ఈ మద్య ప్రపంచంలోని దేశాలన్ని కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కడిక్కడ వ్యవస్థలన్నీ స్థంబించిపోయే పరిస్థితి నెలకొంది.  యూరప్ దేశాలు విలవిల్లాడుతున్నాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే వైరస్ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే బయటకు పంపిస్తున్నారు. ఈ కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎక్కువగా చూపించిందన్న విషయం తెలిసిందే. వందల కోట్ల నష్టాన్ని ఇండస్ట్రీ భరించే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే థియేటర్ల మూసివేతతో ఓ వైపు యాజమాన్యం.. మరోవైపు సినిమా కోసం పెట్టుబడులు పెట్టిన వారు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతున్నారు.  


మరోవైపు కరోనా ప్రభావం వల్ల షూటింగ్స్ క్యాన్సల్ చేసుకొని స్టార్ హీరోలు, సిని వర్గానికి చెందిన వారు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇక కరోనా అనుమానం ఉన్న వ్యక్తులను క్వారంటైన్ కు తరలించి 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ నటి పూజ హెగ్డే 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకుంది. ప్రభాస్ తాజా చిత్రంలో పూజ నటిస్తోంది. షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన పూజ అక్కడి నుంచి తిరుగుపయనమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. 


ఇప్పటికే ఈ మూవీలో నటించిన కమెడియన్ ప్రియదర్శ తనను తాను హౌజ్ అరెస్ట్ చేసుకున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.  ఏది ఏమైనా సామాన్యులు, సెలబ్రెటీలు ప్రతి ఒక్కరూ కరోనా ప్రభావం వల్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.   పూజా హెగ్డే  ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ కు వచ్చిన వెంటనే తాను చేయబోయే పని... ఇంట్లో తనను తాను నిర్బంధించుకోవడమని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: