కొంత కాలంగా సినిమాలకు దూరంగా వున్న సౌత్ హీరోయిన్ శృతి హాసన్ మళ్ళీ బిజీ అవుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ లో నటిస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్నినట్లుగా తెలుస్తుంది. గత రెండేళ్లుగా  సినిమాలకు  దూరంగా వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శృతి హాసన్ , పవన్ కు జోడీగా నటించనుంది. కాగా వీరిద్దరూ జంటగా నటించడం ఇది రెండో సారి.
 
ఇంతకుముందు గబ్బర్ సింగ్ లో జోడిగా నటించగా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇటీవలే  వకీల్ సాబ్ సెట్స్ మీదకు వెళ్లగా .. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. దాంతో మే లో విడుదకావాల్సిన ఈ  చిత్రం జులై లో రానుందని సమాచారం. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా యువ హీరోయిన్లు  అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.   
 
సోషల్ మెసేజ్ తో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్, ఇటీవలే  క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో కూడా ఓ సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారం లో వుంది.  ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం లో అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక  పాత్రలో కనిపించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: