మిర్యాలగూడ లో దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత తన ఇంటి పక్కన ఉండే ఒక యువకుడి పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కరీం కు.... యువకుడికి సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్న అమృత యువకుడు తాను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉంటున్నాడని కూడా వెల్లడించింది. అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి. తన తండ్రి ని చివరిసారిగా చూసేందుకు అంత్యక్రియల వద్దకు వెళ్లిన అమృత ను ఆమె బంధువులు అడ్డుకున్నారు. తర్వాత అమృత కు మరియు ఆమె బాబాయ్ శ్రవణ్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

 

అయితే తర్వాత అమృత తల్లిని కలిసి మాట్లాడింది. తాను తన తల్లితో మాట్లాడడానికి రక్షణ కల్పించేందుకు పోలీసులను కోరగా రెడ్డి కాలనీ లోని మారుతీరావు నివాసానికి ముందుగా వెళ్లిన పోలీసులు వారి బంధువులను కుటుంబ సభ్యులను ఇంటి పై అంతస్తు పంపించిన అనంతరం ఆమెకు కొంత సమయం ఇచ్చారు. కాగా పోలీసులు సమాచారం బయటికి పొక్కకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. తల్లిని కలిసిన అమృత పది నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్లు సమాచారం.

 

తన తల్లిని కలిసిన సమయంలో వారి బంధువులను సైతం ఎవ్వరిని వారి వద్ద ఉండనీయలేదు. తండ్రి అంత్యక్రియల అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతీ రావు ఆస్తి నాకు అవసరం లేదని, ఆస్తి కోసం తాను న్యాయ పో రాటం చేయబోనని ప్రకటించడం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా తాను నివాసం ఉంటున్న ఇంటి ఎదురుగా ఉంటున యువకుడు తన భర్తను హత్య చేసిన కరీం కు తన వ్యక్తిగత సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నాడు అని ఆమె ఆరోపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

 

అయితే పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండగా.... ప్రణయ్ హత్య జరిగినప్పుడు కరెక్ట్ అదే సమయానికి అతను హాస్పిటల్ కు అమృతతో కలిసి వెళ్లినట్లు హంతకుడికి ఎవరు సమాచారం చేరవేశారు అన్న కోణంలో కూడా యువకుడి పై అనుమానాలు నెలకొన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: