టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ బాహుబలి, బాహుబలి 2.  ఈ మూవీలో నటించిన ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తిపు వచ్చిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి ప్రభాస్ నటించే ప్రతి సినిమాలు జాతీయ స్థాయిలో అంచనాలు వేస్తున్నారు.  ఈ నేపథ్యంలో గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ నటించిన ‘సాహెూ’  పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది.  కానీ ఈ మూవీ అనుకున్న సక్సెస్ మాత్రం సాధించలేక పోయింది.  ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమాలో నటిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. జార్జియాలో రెండు రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకొని ఓ ప్రత్యేక జెట్ లో హైదరాబాద్ తిరిగి వచ్చారు చిత్ర యూనిట్. 

 

మూవీ సాద్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలం రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్వన్ దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ ఏకంగా వరల్డ్ వైజ్ గా రిలీజో చేయబోతున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈమూవీ పూర్తిగా సైన్స్ ఫిక్షన్ జోనర్లో నడవనుందట. అంటే ఈ మూవీ ఒక గ్రాఫిక్ మాయాజాలం అని చెప్పొచ్చు.  

 

ఒకప్పుడు ఆదిత్య 369 లా టైమ్ మిషన్ నేపథ్యంలో ఈ మూవీ సాగబోతుందట. అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చు.   అందువలన విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమా ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పిన దానిని బట్టి కేవలం విఎఫ్ఎక్స్ కోసమే 50 కోట్లను కేటాయించారనేది తాజా సమాచారం. దీనిని బట్టి చూస్తే, ఇది కూడా భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే సినిమానే అనే విషయం అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: