గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని ఓ పెను భూతంలా భయపెడుతుంది కరోనా (కోవిడ్19) వైరస్. ఈ కరోనా వైరస్ వల్ల మనిషి జీవిన విధానమే మారే పరిస్థితి దాపురించింది. అసలే ఆర్థిక మాంద్యం ర్రా మోర్రో అనుకుంటే.. పుండు మీద కారం జల్లినట్లు ఇప్పుడు కరోనా మహమ్మారి ఒకటి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇది మానవ తప్పిదమో.. లేదా ఏ ఇతర కారణం అయి ఉండవొచ్చు.. చైనాలోని పుహాన్ లో ఈ కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. ఈ కరోనా బూచీ వల్ల వాణిజ్య వ్యవస్థ అంతా అస్తవ్యస్థం అవుతుంది. తాజాగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా సినీ రంగంపై పడిన విషయం తెలిసిందే.
ఇక సినిమా వాళ్లు తమ సినిమాల షూటింగ్లని వాయిదా వేసుకుంటున్నారు. కొంత మందేమో సినిమా రిలీజ్లని కూడా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్ లోవస్తున్న మూవీ ఇప్పటికే షూటింగ్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. చిరు బాటలోనే మరికొంత మంది నడుస్తున్నారు. పవన్కల్యాణ్ నటిస్తున్న `వకీల్సాబ్` రిలీజ్ని కూడా వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు నాని నటిస్తున్న ‘వి’ చిత్రం కూడా వాయిదా వేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఇదే వరుసలో మరో రెండు చిత్రాల రిలీజ్లు వాయిదా పడినట్టు తెలిసింది.
అనుష్క నటిస్తున్న `నిశ్శబ్దం` ఒకటి కాగా మరొకటి వైష్ణవ్తేజ్ హీరోగా పరిచయం అవుతున్న `ఉప్పెన`. కోన వెంకట్తో కలిసి టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న `నిశ్శబ్దం` చిత్రాన్ని ముందు ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. వైష్ణవ్తేజ్ హీరోగా పరిచయం అవుతున్న `ఉప్పెన` చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్తో కలిసి దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఈ రెండు చిత్రాలు వాయిదా వేసే అవకాశం ఉందని.. ఒకవేళ అదే జరిగితే మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేస్తారని అంటున్నారు.