ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటూ ఒక వెలుగు వెలుగుతున్న బ్యూటి పూజా హెగ్డే. ఏ ముహూర్తాన దువ్వాడ జగన్నాధం సినిమాతో బికిని వేసి రెచ్చిపోయిందో గాని ఆ దెబ్బకి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అందరూ పూజా వెనకాలే పడుతున్నారు. ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు దర్శకులు, స్టార్ హీరోలు కూడా మాకు పూజా నే కావాలంటున్నారు. వాస్తవంగా పూజా హెగ్డే కి ముందు టాలీవుడ్ లో నటించిన ముకుందా, ఒక లైలా కోసం సినిమాలతో అంతగా క్రేజ్ రాలేదు. అయితే బాలీవుడ్ వెళ్ళి అక్కడ భారీ ఫ్లాప్ చూసి తిరిగి డీ.జే తో తెలుగు కి వచ్చిందో గాని పూజా ఫేట్ మొత్తం మారిపోయింది. ఒకరకంగా ఇది డైరెక్టర్ హరీష్ శంకర్ పుణ్యమే అని చెప్పాలి.

 

ఇక మొన్న సంక్రాంతి సీజన్ లో రిలీజైన 'అల వైకుంఠపురంలో' సినిమాతో మరో భారీ సక్సస్ ని పూజా తన ఖాతాలో వేసుకుంది. అయితే టాలీవుడ్ లో ఇంత పాపులారిటిని సంపాదించుకున్నా కూడా బాలీవుడ్ అంటే పూజా కి యమా క్రేజ్. అందుకే అక్కడ హౌస్ ఫుల్-4 ఛాన్స్ వచ్చేదాకా పట్టు వదలకుండా ట్రై చేసి సక్సెస్ అందుకుంది. ఇదే ఊపుతో ప్రస్తుతం పూజా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ‘కబీ ఈద్ కబీ దివాలీ’ సినిమాలో అలాగే మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. 

 

అంతేకాదు ఈ బాలీవుడ్ సినిమాలకి పూజా అందుకుంటున్న రెమ్యూనరేషన్ అక్షరాలా నాలుగు కోట్లని బాలీవుడ్ మీడియా సమాచారం. టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో  నటించిన అల వైకుంఠపురంలో సినిమాకి పూజాహెగ్డే తీసుకున్న రెమ్యూనరేషన్ రెండు కోట్లని.. ఈ సినిమా సక్సస్ తర్వాత రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. బాలీవుడ్లో ప్రస్తుతం కమిటయిన సల్మాన్, అక్షయ్ సినిమాలు గనక బ్లాక్ బస్టర్ అయితే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో పూజా ఎంత డిమాండ్ చేస్తుందో ..! అంటూ మేకర్స్ చర్చించుకుంటున్నారట. 

 

ఇక బాలీవుడ్ లో పిచ్చ ఫాం లో ఉన్న లక్కీ హీరోయిన్ కియారా అద్వానీ. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'వినయ విధేయ రామ' భారీ డిజాస్టరయినా ఆ ప్రభావం కియారా మీద ఏమాత్రం పడలేదు. బాలీవుడ్ లో భారీ హిట్స్ అందుకుంటున్న కియారా ని మళ్ళీ టాలీవుడ్ కి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మన మేకర్స్.

 

ఈ నేపథ్యంలో కియారా ని ఒక స్టార్ హీరో సినిమాకి సంప్రదించారట. అయితే కియారా ఆ సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. అయినా ఈ లక్కీ హీరోయిన్ అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే, కియారా అద్వానీ ల పెంపకానికి బడా ప్రొడ్యూసర్ సంగతి అలా ఉంచితే మిగతా వాళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయట.  

మరింత సమాచారం తెలుసుకోండి: