రెజినా కెసెండ్రా... తెలుగులో స్టార్ హీరోయిన్  అవుతుందనుకున్నారు. ఆ సమయంలో ఈ అమ్మడి ఊపు కూడా అలానే ఉండింది. చేసిన సినిమాలన్ని వరుసగా హిట్ అవుతు వచ్చాయి. మెగా హీరో సాయి ధరం తేజ్ తోనే పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే రెండు సినిమాలు చేసి హిట్స్ ని అందుకుంది. అంతేకాదు కొత్త జంట, పవర్ ఇలా మంచి సినిమాలే చేసింది. హిట్స్ కూడా బాగానే దక్కాయి. కాని ఎందుకనో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అయితే అందుకు కారణం ఒక సందర్భంలో తనకి అవకాశాలు కరువవ్వడం దాంతో పాటు వచ్చిన ఒకటి రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాపవడం జరిగాయి. దాంతో తెలుగులో రెజీనాని ఎవరూ పట్టించుకోలేదు.

 

క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం సినిమాలో లిమిటేషన్స్ పెట్టుకోకుండా గ్లామరస్ గా కనిపించి హీరో తో రొమాన్స్ చేసినప్పటికి ఆ సినిమా రెజీనా కి ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతే కాదు నాని నిర్మాతగా తెరకెక్కిన ప్రయోగాత్మక సినిమా అ కూడా ఫ్లాపయింది. దాంతో ఇక టాలీవుడ్ లో రెజీనా టైం అయిపోయిందనుకున్నారు. కాని అడవి శేషు హీరోగా నటించిన రీసెంట్ మూవి ఎవరు తో మళ్ళీ ఫాం లోకి వచ్చింది.

 

సినిమా హిట్ తో రెజీనా మరోసారి ప్రయోగాత్మకమైన సినిమాలో నటిస్తుంది. ఇటీవల ఆ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఏకంగా రెజీనా మెగాస్టార్ చిరంజీవి సరసన ఆడి పాడింది. ఆయన కథానాయకుడిగా సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో ఇటీవల మెగాస్టార్ రెజీనా మీద ఒక స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. ఆ సాంగ్ సినిమాకి చాలా హైలెట్ అవుతుందట. 

 

ఇక కుర్ర హీరోయిన్స్ అందరు సామాజిక మాద్యమాలలో ఫ్యాన్స్ కి నిరంతమ టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ కూడా హాట్ హాట్ ఫొటోలతో యూత్ కి చమటలు పట్టిస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు. కొంతమంది కురాళ్ళు పెట్టే హాట్ కామెంట్స్ కి రిప్లే ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. కానీ రెజీనాకి ఆ తరహా ఫాలోయిన్ అక్కర్లేదంటుంది. పొరపాటున తన ఫొటోలకి ఏవైనా పిచ్చి కామెంట్స్ వస్తే తట్టుకోలేదట. చాలా ఫీలవుతుందట. మరి ఈ మాటలు నమ్మొచ్చా ..! స్క్రీన్ మీద రెచ్చిపోయిన ఈ బ్యూటి ఇలా అంటుంటే అందరికి అనుమానాలొస్తున్నాయంటున్నారు. నిజమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: