ప్రస్తుతం హాట్ బ్యూటి కియారా అద్వాని స్పీడ్ కి బ్రేకులు వేసే వాళ్ళు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ముందు హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంటరైనప్పటికి ఫుల్ ఫాం లో ఉంది మాత్రం బాలీవుడ్ సినిమాలతోనే. అంతేకాదు ఇప్పుడు కియారా బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో కియారా అద్వానీ గట్టి హిట్ అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ జంటగా 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. అయితే ఒక సినిమా సూపర్ హిట్ మరో సినిమా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ మేకర్స్ కియారా లక్కీ హీరోయినా కాదా అంటూ మేకర్స్ కన్‌ఫ్యూజన్ లో పడిపోయారు. అందుకే మళ్ళీ కియారాకి ఆఫర్ ఇవ్వడానికి అంత త్వరగా మేకర్స్ ముందుకు రాలేదు. 

 

కాని ఊహించని విధంగా కియారా బాలీవుడ్ లో చక్రం తిప్పింది. కేవలం ఒక వెబ్ సిరీస్ ఒక సినిమా తోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక కియారా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన 'గిల్టీ' తో మరోసారి అందరినీ అట్రాక్ట్ చేసింది. ఒక వైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళతో మంచి కథా బలమున్న సినిమాలని సెలెక్ట్ చేసుకుంటూనే మరో వైపు వీలైనంత గా బోల్డ్ క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని హీటెక్కిస్తోంది. ఇవి రెండు కియారాకి బాగా కలిసొస్తున్నాయి. 

 

ఇక యాడ్ ఫిలింస్, మ్యాగజైన్ కోసం ఎంతగా హాట్ గా కనిపించి కవ్వించాలో అంతా చేస్తోంది. కేవలం సినిమాల్లో కాకుండా హాట్ ఫోటో షూట్ తోను యూత్ ని కైపెక్కిస్తుంది. దాంతో హాట్ లుక్ తో కనిపిస్తున్న కియారా అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరి ఈ రేంజ్ అందాలు ఆరబోస్తున్న కియారాకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఛాన్సులివ్వడానికి మేకర్స్ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు కియారా కావడం ఆసక్తికరం. ఇక టాలీవుడ్ లో కూడా ఒక స్టార్ హీరో సినిమా కోసం మేకర్స్ కియారాని సంప్రదించారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: