సాయి పల్లవి సమర్థత పై ఎవరికీ ఎటువంటి సందేహాలు ఉండవు. ఒక పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించే విధానంతో ఇప్పుడు ఆమె చాలామంది హీరోలకు దూరం అవుతోందా అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓపెన్ గానే కామెంట్స్ వస్తున్నాయి. ‘ఎమ్ సి ఏ’ సినిమా ఎడిటింగ్ సమయంలో నాని స్వయంగా రంగంలోకి దిగి సాయి పల్లవి తనను డామినేట్ చేస్తూ చేసిన సీన్స్ ను తొలిగించాడు అంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 


అదేవిధంగా సాయి పల్లవి నాగశౌర్యలు కలిసి నటించిన ‘కణం’ మూవీ విషయంలో తనకు కనీస గౌరవం కూడ సాయి పల్లవి ఇవ్వలేదు అంటూ నాగశౌర్య గగ్గోలు పెట్టాడు. ఆమధ్య శర్వానంద్ ‘జాను’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సాయి పల్లవి డామినేషన్ అంటే భయం అంటూ ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి అనుభవం నాగచైతన్య కు సాయి పల్లవి విషయంలో ‘లవ్ స్టోరి’ మూవీ షూటింగ్ లో ఎదురైంది అంటూ ప్రచారం జరుగుతోంది. 


ఇటీవలే ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘హే పిల్లా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ పాట చిత్రీకరణ విషయంలో నాగచైతన్య ఆమెతో సమానంగా డాన్స్ చేయలేకపోవడమే కాకుండా నటన విషయంలో కూడ నాగచైతన్య సాయి పల్లవి ముందు తేలిపోయాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాట చిత్రీకరణ సమయంలో నాగచైతన్య స్టెప్స్ వేయడానికి ప్రతి సీన్ కు 10-20 నుండి టేకులు తీసుకుంటున్నట్లు సమాచారం. 


అయితే సాయిపల్లవి మాత్రం సింగిల్ టేక్ తో ఒకే చేస్తున్న పరిస్థితి చూసి చైతన్య మోహంలో రంగులు మారిపోయాయి అని అంటున్నారు. ఒకవైపు ఈ మూవీ దర్శకుడు శేఖర్ కమ్ముల సాయి పల్లవితో తన స్పీడ్ తగ్గించమని చెప్పినా వినిపించుకోకుండా ఆమె ప్రవర్తించిన తీరుతో చైతన్య సాయి పల్లవి పేరు చెపితేనే భయపడిపోతున్నాడు అని టాక్. ఇలా తాను నటించే ప్రతి హీరోతోను సాయి పల్లవికి సమస్యలు వస్తుంటే ఆమె డామినేషన్ తట్టుకుని నిలబడింది ఒక్క వరుణ్ తేజ్ మాత్రమే అంటూ సెటైర్లు పడుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: