నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ముచ్చటగా మూడోసారి కలిసి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ  ప్రాజెక్ట్‌ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ బాలకృష్ణ.. గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత బ్యానర్ లో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఇక కేయస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన రూలర్ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్నాడీయ‌న‌. 

 

సింహా , లెజెండ్ సినిమాల తరవాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారని తెలుస్తోంది. అందులోనూ ఓ పాత్ర వారణాశి సమీపంలో ఉండే అఘోరాదిని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా కంప్లీటైంది. ఈ చిత్రంలో ముందుగా అంజలి, శ్రియ అనుకున్నారు. అయితే తాజాగా స‌మాచం ప్ర‌కారం..  బాలయ్య, బోయపాటి శ్రీను పాయల్ రాజ్‌పుత్ అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. 

 

మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా త‌ర్వాత  కొరటాల శివతో ఓ సినిమా ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.  కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమా అట. ఈసారి శివ ఆలయాలపై నిర్లక్ష్యం, వాటి వెనుక జరుగుతోన్న అవినీతి’ అనే కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇక  ఈ చిత్రంలో ముందుగా త్రిషను హీరోయిన్‌గా అనుకున్నారు. 

 

కానీ ఏవో కారణాల వ‌ల్ల త్రిష త‌ప్పుకోవ‌డంతో.. కాజ‌ల్ పేరు తెర మీద‌కు వ‌చ్చింది. అయితే ఈమె రెమ్యున‌రేష‌న్ ఎక్కువ డిమాండ్ చేయ‌డంతో చిరంజీవి, కొర‌టాల శివ కూడా పాయల్ రాజ్‌పుత్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి అటు బాల‌య్య‌, ఇటు చిరంజీవి.. ఇద్ద‌రూ బోల్డ్ బ్యూటి పాయ‌ల్ రాజ్‌పుత్‌పై క‌న్నేసారు. మ‌రి ఈమె ఎవ‌రికి ఓకే చెబుతుందో చూడాలి.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: