బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న అఖిల్ లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ నిడివి సుమారు మూడు గంటలు రావడంతో ఎలర్ట్ అయిన నాగార్జునమూవీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ప్రస్తుతం తన సలహాలు ఇస్తున్నట్లు టాక్. ఈ మూవీ నిర్మిస్తున్నది అల్లు కాంపౌండ్ అయినప్పటికీ ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ నాగార్జున క్రియా శీలకంగా వ్యవహరిస్తూ ప్రస్తుతం అన్ని తానై వ్యవహరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

 

‘ఆరెంజ్’ మూవీ ఘోర పరాజయం తరువాత భాస్కర్ ఇమేజ్ అంతా పూర్తిగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఇతదితో సినిమాలు చేయడానికి కూడ చాలామంది హీరోలు ఆసక్తి కనపరచలేదు. ఇటువంటి సమయంలో అఖిల్ ను నమ్మి సినిమా చేసే సాహసం పై ఏ టాప్ డైరెక్టర్ ఆసక్తి కనపరచకపోవడంతో అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో రాజీ పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

 

ఇప్పటి వరకు అఖిల్ నటించిన మూడు సినిమాలను నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో శ్రద్ధపట్టి నిర్మించినా అవి కలిసి రాకపోవడంతో నాగ్ ఈసారి తన రూట్ మార్చి అల్లు కాంపౌండ్ అదృష్టం అనే సెంటిమెంట్ పై నమ్మకం పెట్టుకున్నాడు. అయినప్పటికీ ఈ మూవీ విడుదలకు దగ్గర పడుతున్న పరిస్థితులలో నాగ్ ఇప్పుడు ఇలా ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఈ మూవీ అవుట్ పుట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు టాక్. 

 

కరోనా ఎఫెక్ట్ వల్ల ఈసారి వాయిదా పడ్డ అనేక భారీ సినిమాలు వరసగా ఏప్రిల్ మే నెలలో విడుదల కాబోతున్న పరిస్థితులలో ఈ సమ్మర్ సీజన్ సీజన్ హడావిడి అయిన తరువాత ఈ మూవీ విడుదల చేయాలా లేకుంటే సమ్మర్ రేస్ లోనే ఈ మూవీని విడుదల చేసి అఖిల్ స్టామినాను పరీక్షించుకోవాలా అన్న విషయమై నాగ్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో అఖిల్ సినిమాల విషయంలో నాగార్జున వేలు పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేని సందర్భాలు ఆదరికి తెలిసిన విషయాలే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: