టాలీవుడ్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అవుతుంటే.. ఈ మద్య హీరోయిన్లు గా కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. మల్టీటాలెంటడ్ పర్సన్ గా శృతి హాసన్ సింగర్, మ్యూజి డైరెక్టర్, నటిగా తన సత్తా చాటింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. గత కొంత కాలంగా ఆమె ఓ విదేశీయుడితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ మద్య వీరిద్దరి మద్య బ్రేకప్ రావడంతో మళ్లీ ఇండస్ట్రీవైపు చూపు మరల్చింది శృతిహాసన్. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ మూవీలో నటిస్తుంది.
అయితే గతంలో వీరి కాంబినేషన్ లో బలుపు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రవితేజ, శృతి హాసన్. అయితే ఈ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించే ఓ మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరు గబ్బర్ సింగ్, కాటమరాయుడు మూవీలో నటించారు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా.. కాటమరాయుడు ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. 'దిల్' రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో కొంత కాలం షూటింగ్ వాయిదా వేశారు.
ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్యలను ఎంపిక చేశారు. ఇక పవన్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ పేరు వినిపిస్తుంది. ఈ మూవీ బాలీవుడ్ లో అమితాబచ్చన నటించిన ‘పింక్’ రిమేక్. కాటమరాయుడు తర్వాత మరోసారి ఈ జంట తెరపై చూస్తే పవన్ అభిమానులకు సంతోషకరమైన వార్తే అంటున్నారు.