ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా  కరోనా విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. ఎంతోమందిని ప్రాణభయంతో వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే 160 దేశాలకు పైగా ఈ మహమ్మారి వైరస్ వ్యాపిస్తుంది. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా ఈ ప్రాణాంతకమైనా  వైరస్ అడుపెట్టింది.  దీంతో భారతదేశంలో కరోనా  నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని విద్యాసంస్థల సహా షాపింగ్ మాల్స్ అన్ని మూసేస్తూ కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. అంతేకాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో కీలక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో  ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ మొత్తం కరోనా వైరస్ నియంత్రణకు సహకరిస్తూ తమ సినిమా షూటింగ్ లను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. 

 


 ఈ నేపథ్యంలో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ  సెలబ్రిటీలు... ప్రస్తుతం సినిమా షూటింగ్ లోనే వాయిదా పడడంతో ఇంటికే పరిమితమై పోతున్నారు. ఏకంగా జిమ్ కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే వ్యాయామం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశాన్ని మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన సయి  మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా  వైరస్ ప్రభావంతో రెండవ షెడ్యూల్ ఏప్రిల్ 3న ప్రారంభించేందుకు సిద్ధమైంది. 

 

 ఇక ఈ సినిమాను జులై 30న విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో వరుణ్ తేజ్ ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ కు వెళ్లి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ ఎఫెక్ట్ ఉందని సైలెంట్ గా కూర్చోకుండా... ఇంట్లోనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. అయితే బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఇప్పటికే అమెరికాలో బాక్సింగ్ పై ట్రైనింగ్ తీసుకున్న వరుణ్ తేజ్... మరింత రాటు తేలుతున్నా డు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ కి సంబంధించిన ఓ ఫోటో నెట్ లో వైరల్ అవుతుంది. ఇక వరుణ్ తేజ్ డెడికేషన్ చూసి అటు నెటిజన్లు కూడా ఫిదా అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: