ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమే వణికిపోతోంది. ఇందుకు టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమై పోయారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఇలా ఇళ్లకే పరిమితమైపోయిన హీరోయిన్లలో రష్మిక కూడా ఉంది. అయితే.. షూటింగ్ లేదు కదా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ గడిపేద్దాం అనుకోవట్లేదు రష్మిక. కరోనా వైరస్ ప్రభావంతో వచ్చిన గ్యాప్ ను ఖాళీగా ఉంచకుండా ప్రొఫెషనల్ గానే ఉంచుతోంది. అందుకే నిర్మాతలకు, దర్శకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

 

 

 

కథలు ఉంటే తన మెయిల్ కు పంపాలని కోరింది. ఆ కథలను తాను, తన టీమ్ విని మంచివాటిని సెలక్ట్ చసుకుంటామని ఓపెన్ గా చెప్పింది. దీంతో రష్మిక నిర్ణయానికి అందరూ శెభాష్ అంటున్నారు. వినటానికి, చదవటానికి కూడా రష్మిక ఆఫర్ కొత్తగా ఉంది. నెటిజన్లు కూడా రష్మిక కమిట్ మెంట్ ను అభినందిస్తున్నారు. టైమ్ ను వేస్ట్ చేయకుండా యుటిలైజ్ చేసుకోవడం మంచి పని అని అభినందిస్తున్నారు. ఈ సంక్రాంతికి రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అయింది. ప్రస్తుతం అల్లు అర్జున్సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తోంది.

 

 

 

సినిమా నటులకు కథలే ముఖ్యం. ఎన్నో కథలు వింటూ వాటిలో నచ్చినవి సెలక్ట్ చేసుకుంటారు.. సినిమాలు చేస్తారు. మరికొన్ని సార్లు కథతో సంబంధం లేకుండా కేవలం క్రేజీ స్టార్ హీరో పక్కన అవకాశం వస్తే సినిమా చేస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో ముందు వరుసలో ఉన్న హీరోయిన్ రష్మిక మందన. ఈ కన్నడ భామకు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. వరుస హిట్లు ఆమెను టాప్ లిస్ట్ లో ఉండేలా చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: