మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం `అల వైకుంఠపురంలో` చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ చిత్రంతో పాటు విడుదలైన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సూపర్స్టార్ మహేష్ నటించిన సరిలేరునీకెవ్వరు చిత్రం విడుదలైంది. ఇవి రెండు చిత్రాలు ఒక్కరోజు తేడాతో విడుదలయ్యాయి. అయితే రెండూ హిట్ అయ్యాయిగాని అలకి కాస్త ఎక్కువ పేరొచ్చిందని చెప్పాలి. దీంతో మహేష్ దృష్టంతా త్రివిక్రమ్ మీదకి మళ్ళింది. అయితే ఈ లోపల ఆయన వంశీపైడిపల్లికి మాటిచ్చారు. ఆయనతో సినిమా తీసే పనిలో పడడంతో ఆ కథను విన్నారు. కానీ అది ఆయనను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో వంశీ చిత్రం పెండింగ్లో పడింది.
ఇక ఈ కథను తిరిగి మంచిగా రాయించడానికి వంశీ తనకింద మారో ఆరుగురు రైటర్స్ని పెట్టుకున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ కొత్త కథలు వినే పనిలో పడ్డారు. ఎక్కడా ఆలస్యం చెయ్యకుండా, చిన్నా పెద్దా అని తేడా లేకుండా కథలను వింటున్నారట. అయితే ఆయన మనసు మాత్రం త్రివిక్రమ్ తో మూవీ చేయాలనే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. అల వైకుంఠపురంలో టేకింగ్ తో త్రివిక్రమ్ ఒక్క మహేష్ ఏంటి చాలా మందిని పడగొట్టాడు. అందులోనూ ఇందులో పాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఏ సినిమా అయినా సరే ఆడియోతోనే సగం సక్సెస్ సాధిస్తారు.
దీనితో ఆయతో మూవీ చేయాలని స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుదిరితే త్రివిక్రమ్తో మూవీ చేయడానికి మహేష్ రెఢీగా ఉన్నారట. కానీ త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్టీఆర్ 30వ చిత్రంకి కమిటై ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆయన ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా ఉంటారు. కాబట్టి మహేష్ త్రివిక్రమ్ తో మూవీ చేయాలనుకున్నా అది మాత్రం ఇప్పట్లో జరిగే పని కాదు. కచ్చితంగా వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. అతడు చిత్రం హిట్ అయినా ఖలేజా పర్వాలేదనిపించుకుంది. అయితే ఆ చిత్రం బుల్లితెర మీద మాత్రం హిట్ అయిందనే చెప్పాలి.