కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు ఉంది ఇప్పుడు టాలీవుడ్ హీరోల వ్యవహారం. సినిమాలు విడుదల చేస్తే పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయాలని చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరూ పట్టుదల గానే ఉన్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇలా కొందరు పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు.

 

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యే విధంగా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ నటులు తమ సినిమాల్లో పెట్టుకునే ప్రయత్నం ఇప్పుడు స్టార్ హీరోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా విడుదలై ఆ సినిమా సక్సెస్ అయితే తమకు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ పెరుగుతుందని హీరోలు ఎక్కువ గా భావిస్తున్నారు. ఇప్పుడు దర్శకులు తమ వద్దకు తీసుకు వచ్చే ప్రతి కథ కూడా ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు. మహేష్ బాబు చిరంజీవి కి పాన్ ఇండియా వైడ్ సినిమాలు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.

 

స్పైడర్ సినిమాతో హీరోగా మారాలని మహేష్ బాబు ప్రయత్నాలు చేసినా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది .ఆ తర్వాత రెండు మూడు సినిమాలు ఇలాగే మహేష్ కి షాక్ ఇచ్చాయి. చిరంజీవి సైరా సినిమా ,ఖైదీ నెంబర్ వన్ సినిమా కూడా ఆడలేదు. కానీ బాహుబలి సినిమా తో మాత్రం ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు మన హీరోలు అందరూ పాన్ ఇండియా వైడ్ గా సినిమా చేస్తే చేయాలని లేకపోతే ఆ సినిమా వద్దని భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: