సూప‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన భామ అనుష్క. ఈ మ‌ధ్య కాలంలో చాలా గ్యాప్ త‌ర్వాత `నిశ‌ద్ధం` చిత్రంతో తెర‌మీద‌కు రాబోతుంది. సైజ్ జీరో చిత్రంతో కాస్త వెయిట్ పెర‌గ‌డంతో కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతుంది. బాహుబ‌లి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ సినిమాలో హీరోయిన్ మూగ పాత్ర చేయగా, హీరో గుడ్డివాడైన గాయకుడి పాత్రలో మాధ‌వ‌న్ క‌నిపిస్తాడు. ఇప్పుడు ఈ ‘నిశ్శబ్దం’ సినిమాలో కూడా అనుష్క మూగదైన పెయింటర్ గా కనిపిస్తుండగా మాధవన్ అంధుడైన మ్యూజిషియన్ పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్స్ సంయుక్తంగా క‌లిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా గోపి సుందర్ వ్యవహరిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

 

ఇక అస‌లే సినిమాలు లేక ఇబ్బంది ప‌డుతున్న స‌మ‌యంలో నిశ‌బ్ధం చిత్రం పై అస‌లే ఎవ్వ‌రికీ పెద్ద హోప్ లేదు. అందులోనూ ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌న పుట్టిన‌రోజును పురస్క‌రించుకుని ఇటీవ‌లె జ‌రిగిన ఓ ఈవెంట్‌లో ఎంతో మంది అతిర‌ధ మ‌హార‌ధులు వ‌చ్చారు కానీ ఎవ్వ‌రికీ కూడా ఇది నిశ‌బ్దం చిత్రానికి హెల్ప్ అవ్వ‌లేదు. ఏమాత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా అయితే లేదు. ఇక ఈ చిత్రం పై మొద‌టి నుంచి నివ‌బ్దం ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేదు.  త‌న బ‌ర్త‌డే సెల‌బ్రేష‌న్ కూడా పెద్ద‌గా ఏమీ సినిమాకి యూజ్ కాలేదనే చెప్పాలి. ఇక ట్రైల‌ర్ కూడా పెద్ద‌గా ఆశించ‌లేదు. ప్ర‌స్తుతం అనుష్క మాత్రం ఈ సినిమా పైనే ఎక్కువ‌గా హోప్స్ పెట్టుకుంది. మ‌రి ఈ క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా రిలీజ్ డేట్ కూడా  వాయిదా ప‌డేలా ఉంది. దీంతో అనుష్క టెన్ష‌న్ ప‌డిపోతుంది. ఏం చేయాలో కూడా అర్ధం కాక డైన‌మాలో ప‌డిపోయింద‌ట అనుష్క‌. ఇక త‌న‌కు ఈ చిత్రం మంచి హిట్ కావాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: