దేశ రాజధానిలో 2012, డిసెంబ‌ర్ 16న ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా గాయపరిచిన నింధితులకు నేడు ఉరిశిక్ష పడింది.  ఏడేళ్లు గా చట్టంలోని ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకొని చివరి దాకా తప్పించుకోవడానికి ప్రయత్నించి విఫలమైయ్యారు. నేడు నిర్భయ నింధితులను ఉరిశిక్ష విధించారు.  హంత‌కుల‌ని ఉరికంబం ఎక్కించేంత వ‌ర‌కు భ‌యప‌డ‌న‌ని, ఎలాంటి బెదిరింపుల‌కు లొంగ‌న‌ని శ‌ప‌థం చేసిన ఆ త‌ల్లి చివ‌రి దాదాపు ఏడేళ్ల నిరీక్ష‌ణ‌కు ఫ‌లితం ల‌భించింది. నిర్భ‌య దోషుల‌కు శుక్ర‌వారం ఉరిశిక్ష‌ని అమ‌లు చేసింది. దీనిపై స‌ర్వ‌త్రా హ‌ర్ష‌తిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా నిర్భయ  ఎట్టకేలకు నిర్భయ ఘటన దోషులకు మరణశిక్షపడింది. ఈ పరిణామం కేవలం నిర్భయ కుటుంబానికి మాత్రమే కాదు... ఆడపిల్లలున్న ప్రతి కుటుంబానికీ చట్టం అభయం ఇచ్చినట్టయ్యింది. దోషులకు ఉరి అమలు చేసినందుకు యావత్ సమాజం సంతోషపడింది. కానీ ఇంతటి హేయమైన క్రూరత్వానికి పాల్పడిన అసలు నేరస్తుడు మరొకడు మైనర్ పేరుతో విడుదల కావడం బాధాకరం. ఆ మృగాడికి (మృగాలకు క్షమాపణతో...) ఏదో ఒక రూపంలో తగిన శిక్ష పడుతుందని విశ్వసిస్తున్నాను.

 

నిజానికి ఇది సరిపోతుందా? ఈ సందర్భంగా మనం హైదరాబాదులో కలకలం రేపిన దిశ కేసు పరిణామాలను కూడా గుర్తు చేసుకోవాలి. నిర్భయ విషయంలో గానీ, దిశ ఘటనలో గానీ ఆ దారుణాలు జరిగినప్పుడు యావత్ సమాజం ఆందోళనలకు దిగి దోషులకు వెంటనే శిక్ష పడాలని, ఎన్‌కౌంటర్ చెయ్యాలని భారీ ఎత్తున నిరసనలకు దిగింది. అయితే, న్యాయ ప్రక్రియ ఏళ్ళ తరబడి జాప్యం జరుగుతున్న కొద్దీ కొన్ని వర్గాలు రకరకాల కారణాలు పేర్కొంటూ బాధితుల్ని వదిలేసి దోషుల పక్షం చేరుతున్నాయి. ఈ దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? వాళ్ళను క్షమించి వదిలేయాలి... అనే వాదనలు లేవదీస్తున్నారు. మేధావులుగా చెప్పుకునే అలాంటివారి ఆ వాదన ప్రకారం హత్యాచార దోషులకు శిక్షలే వేయకుండా క్షమిస్తే ఈ దేశంలో ఆడపిల్లను మ్యూజియంలో చూడాల్సిందే... ఆ వాదన ప్రకారం రేపిస్టులను మాత్రమే ఎందుకు క్షమించాలి? దొంగతనాలు, మోసాలు, దాడులకు పాల్పడినవారికి కూడా శిక్షలు పడుతున్నాయి. మరి ఈ నేరాలు మాత్రం ఆగాయా? వీళ్ళను మాత్రం క్షమించ వద్దా? ఇలా నేరాలు ఆగడం లేదు కదా... అని శిక్షలే వెయ్యకుండా ఉంటే ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్లు, కోర్టులను మూసేద్దామా? సమాజాన్ని ఎలా తయారు చెయ్యాలనుకుంటున్నారో ఆ మేధావులే చెప్పాలి.

 

మన సమాజాన్ని నైతికంగా సంస్కరించే విషయాన్ని పక్కనపడేసి ఇలాంటి వాదనలు చేసేవారున్నంత కాలం ఆడపిల్లకు సత్వర న్యాయాన్ని ఆశించలేం. ఈ రోజున కరోనా వ్యాధి విజృంభించడంతో అందరికీ ప్రాణభయం పట్టుకుని ఎవరికివారు మాస్కులు వేసుకుంటూ, సానిటైజర్లు వాడుతూ ఇంటికి పరిమితమై ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. ఆడపిల్ల విషయంలోనూ ఇదే జరగాలి. సంస్కరణ అనేది మన ఇంటి నుంచి మొదలైతే ఆడపిల్లను కాపాడుకోగలుగుతాం. కన్నతండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులే ఆడపిల్లలపాలిట యమదూతలుగా మారి వారి జీవితాల్ని పాడుచేస్తున్న వార్తల్ని చదువుతుంటే కడుపు రగిలిపోతోంది. సృష్టి చేసే స్త్రీమూర్తి ప్రాధాన్యత గురించి ఇంట్లో, పాఠశాలల్లో... యావత్ సమాజంలోని మగపిల్లలకు తెలియజేసి వాళ్ళను సంస్కరిస్తే అత్యాచారాలపై ఇంతగా అందోళన చెందాల్సిన పరిస్థితి రానే రాదు. మృగాళ్ళకు శిక్షలు పడాలా.. వద్దా.. అనే దురదృష్టకరమైన చర్చ చేయాల్సిన దుస్థితి ఉండదని విజయశాంతి సిరియస్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: