హీరో ప్రభాస్ కూడా కరోనా ఎఫెక్ట్తో ఆయన స్వియ నిర్భంధనలో ఉండిపోయారు. ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ చిత్రానికి సంబంధించి ఆయన షూటింగ్ నిమిత్తం ఇటీవలె ఫారెన్ దేశాలు తిరిగి షూటింగ్ని కొంత వరకు పూర్తి చేసుకున్నారు. ఇక ప్రపంచమంతా కరోనాతో వణికిపోతున్న నేపధ్యంలో ఎక్కువ రోజులు అక్కడ ఉండటం ఎవ్వరికి శ్రేయస్కరం కాదని భావించిన ఆయన వెంటనే తన సొంత విమానంలో హుటా హుటిన చిత్ర యూనిట్ అంతా బయలుదేరి వచ్చేశారు. ఇక ఇదిలా ఉంటే. ఈ సినిమా మొదలయినప్పటి నుంచి కూడా ఏదో ఒక ఆటంకంటో ఎప్పటికప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
మరి ఈ సారి కూడా కరోనాతో ఈ చిత్రం అనుకున్న సమయానికి పూర్తయ్యేలా లేదు. కొన్నిరోజులు వాయిదా పడేలా ఉంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు గుండెల్లో టెన్షన్ మొదలయింది. . ఇక ప్రభాస్ కొత్త చిత్రానికి ‘జాన్’, ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రభాస్తో సహా ప్రత్యేక విమానంలో టీమ్ అంతా ఇండియాకు వచ్చేసింది. అయితే కరోనా వైరస్ కారణంగా ప్రభాస్ సినిమా షూటింగ్ని పేశారని, ఆ కారణంగానే టీమ్ అర్థాంతరంగా షెడ్యూల్ని ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారని ప్రచారం మొదలైంది.
అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, తమ షూటింగ్ని ఎవరూ ఆపలేదని, షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ని పూర్తి చేశామని దర్శకుడు రాధాకృష్ణకుమార్ వెల్లడించారు. ఇండియా వచ్చిన ఈ చిత్ర బృందానికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ చిత్రాన్ని యువి. క్రియేషన్స్ సంస్థి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరో పక్క సెలబ్రెటీలు సైతం కరోనా వైరస్పై దేశప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక వారికి వారు స్వియ నిర్భంధనలో ఉంటున్నారు.