అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ తో మంచి ఫాం లో ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా తీసి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత తీసి యావరేజ్ హిట్ ఇచ్చారు. వాస్తవంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఊహించుకున్నారు. కాని ఊహలు దెబ్బైపోయాయి. అనికున్నంతగా అరవింద సక్సస్ ని అందుకోలేదు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ తో తీసిన అల సినిమా మాత్రం త్రివిక్రమ్, బన్నీ లకి బౌన్స్ బ్యాక్ సినిమాగా నిలిచింది.

 

ఇక ఇంతవరకు త్రివిక్రమ్ తీసిన సినిమాలలో రెండవసారి మళ్ళీ ఆ హీరోలతో సినిమాలు తీయలేదంటే వాళ్ళు కుర్ర హీరోలు నితిన్, తరుణ్ లే. ఎన్.టి.ఆర్ తో 'అరవింద సమేత' తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ తో 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే త్రివిక్రమ్ చేసిన సినిమాలలో రెండు మహేష్ బాబుతో పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు అల్లు అర్జున్ తో మూడు సినిమాలు తెరకెక్కించారు. ఇక త్రివిక్రమ్ ఏ హీరోతో తీసినా తిరిగి మళ్లీ మెగా ఫ్యామిలీ హీరోల కోసమే కథ రాస్తున్నారని అంటున్నారు. ఈ న్యూస్ గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవితో, అలాగే రాంచరణ్ లతో సినిమాలు తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ రకంగ్గా చూస్తే త్రివిక్రమ్  మెగా ఫ్యామిలీతో బాగా ట్యూన్ అవుతున్నట్టే అనిపిస్తుందని ప్రచారం సాగుతోంది. అయితే ఇందుకు ఒక ముఖ్య కారణం త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ కావడం అయితే మెగా ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలుండటం మరో కారణం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: