సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో మూవీ చేస్తాడని అందరు అనుకున్నారు. సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న ఆ సినిమా కాస్త అటకెక్కింది. వంశీ ప్లేస్ లో పరశురామ్ వచ్చి చేరాడు. మహేష్ పరశురామ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఉగాది రోజు ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. మైత్రి మూవ్ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తారట. మహేష్ శ్రీమంతుడు సినిమాతోనే మైత్రి మూవీ మేకర్స్ ఏర్పడ్డది. అందుకే మహేష్ సినిమా అంటే వాళ్ళెప్పుడైనా రెడీ అంటారు. 

 

గీతా గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్ కొట్టాక కూడా పరశురామ్ నెక్స్ట్ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. మహేష్ పరశురామ్ అసలు ఊహించని ఈ కాంబినేషన్ సెట్ అవడానికి వెనుక ఉన్న ఒక డైరక్టర్ కొరటాల శివ అని తెలుస్తుంది. మహేష్ ఫ్లాఫుల్లో ఉన్నప్పుడు శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ భారత్ అనే నేను సినిమా కూడా హిట్ ఇచ్చిన పరశురామ్ అంటే మహేష్ కు చాలా అభిమానం. అతని నిర్ణయాన్ని గౌరవించే మహేష్ పరశురామ్ స్టోరీ తనకు బాగా వర్క్ అవుట్ అవుతుందని అనిపించే సినిమా ఒకే చేశాడట. 

 

మరోపక్క వంశీ పైడిపల్లి దగ్గర సోలమన్ అనే రైటర్ ఉండేవాడు. అతను ఇప్పుడు సోలోగా సినిమా చేస్తున్నాడు. నాగార్జునతో వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సోలామాన్ ఉంటే వంశీ స్క్రిప్ట్ వర్క్ బాగా వచ్చేదట. మహేష్ కు చెప్పిన కథలో ఫాస్ట్ హాఫ్ నరేషన్ బాగున్నా సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో మహేష్ వంశీ మూవీ కాదని పరశురామ్ తో ఫిక్స్ అయ్యాడు. 

 

 

 

 

 '

 

మరింత సమాచారం తెలుసుకోండి: