ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా క్రేజ్ తెచ్చుకున్న వారిలో పూజా హెగ్దే, రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. మొదట్లో ఐరన్ లెగ్ ఇమేజ్ వచ్చినా ఆ తర్వాత తన అందంతో ఆడియెన్స్ కు కట్టిపడేస్తుంది పూజా. ఇక రావడం రావడమే ఓ సూపర్ హిట్ తో వచ్చి అదే హిట్ మేనియా కొనసాగిస్తుంది కన్నడ భామ రష్మిక మందన్న. ఇద్దరు మంచి స్వింగ్ లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వీళ్ళ డిమాండ్ ఓ రేంజ్ లో ఉందని వాళ్లకి అర్ధమైంది. అందుకే ఇదివరకు రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోని ఈ భామలు ఇప్పుడు వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్నారు. 

 

ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్స్ అటు ఇటుగా ఒక మీడియం రేంజ్ హీరో రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే కోటి మా అంటే మరో అర కోటిలో సెట్ చేసేవారు. కానీ ఇప్పుడు వారి డిమాండ్ మరింత పెరిగింది.. సినిమా కాస్ట్ కూడా పెరగడంతో కోటి కాస్త రెండు కోట్లు అయింది. మరి మారాం చేస్తే రెండున్నర కోట్ల దాకా ఇచ్చేలా ఉన్నారు. అయితే వారికి ఇచ్చే రెమ్యునరేషన్ కు తగినట్టుగా సినిమాకు మార్కెట్ జరుగుతుంది. అందుకే పూజా హెగ్దే రష్మిక డేట్స్ దొరకడమే అదృష్టం అన్నట్టుగా భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. 

 

మిగతా హీరోయిన్స్ ఎన్ని హిట్లు కొడుతున్నా సరే ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలు వీళ్లిద్దరి జపమే చేస్తున్నారు. వీళ్ళలో ఎవరు దొరకకపోతే బాలీవుడ్ భామ కియరా అద్వానీ కోసం ట్రై చేస్తున్నారు. హీరోయిన్స్ విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు ఉండే కొరత అందరికి తెలిసిందే. అందుకే పూజా, రష్మిక, కియరాల కోసం వెంటపడుతున్నారు. మరి డిమాండ్ ను బట్టే వారు కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: