యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సినిమా సాహో. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరక్టర్ సుజిత్ తో ప్రభాస్ చేసిన ఆ సినిమా ఆషించిన స్థాయిలో ఆడలేదు. సినిమా బడ్జెట్ తెర మీద కనిపిస్తున్నా ఆ బడ్జెట్ కు తగిన కథ లేదని ఆడియెన్స్ నిరాశ చెందారు. సాహో తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా 150 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

సాహో ఊహించని షాక్ ఇవ్వడంతో డైరక్టర్ సుజిత్ పరిస్థితి దారుణంగా మారింది. అతనికి యువి క్రియేషన్స్ వారే మరో ఛాన్స్ ఇస్తారని తెలుస్తుంది. అయితే సుజిత్ మళ్లీ ప్రభాస్ తోనే సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్. సుజిత్ మళ్లీ ప్రభాస్ తో సినిమానా అయినా డార్లింగ్ ఒప్పుకుంటాడా అని అనుకోవచ్చు. యువి వాళ్లతో మాట్లాడింది కూడా ప్రభాసే అని తెలుస్తుంది. రాధాకృష్ణ తర్వాత మరోసారి ప్రభాస్ సుజిత్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేశాడని ఫిల్మ్ నగర్ టాక్.

 

అయితే ఈసారి కేవలం తెలుగులోనే రిలీజ్ చేసేలా మీడియం బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఫ్లాప్ ఇచ్చాడు కాబట్టి సుజిత్ పై ఎవరు నమ్మకం ఉంచట్లేదు. అందుకే హిట్టు ఇచ్చి అతని కెరియర్ పుష్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. అయితే యంగ్ రెబల్ స్టార్ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతుంది. స్టార్ డైరక్టర్స్ తో కాకుండా యువ దర్షకులతో ప్రభాస్ పనిచేయడం గురించి వారు కొద్దిగా అసంతృప్తిలో ఉన్నారు. రాధాకృష్ణ డైరక్షన్ లో మూవీ కాగానే నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా మాత్రం ఇంటర్నేషనల్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: