దాదాపు రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ న‌టించిన చిత్రం వ‌కీల్‌సాబ్‌. ఇక ఈ చిత్రంలో శృతిహాస‌న్‌ని హీరోయిన్‌గా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇక వీరిద్ద‌రూ క‌లిసి గ‌తంలో కాట‌మ‌రాయుడు చిత్రంలో న‌టించారు. మ‌రోసారి వీరిద్ద‌రూ తెర‌పైన క‌నిపించ‌నున్నారు. అయితే ఇదంతా స‌రే కాని, కాల్షీట్ల విషయంలోనే మరోసారి ఈ కాంబినేషన్ అనుమానంలో పడింది. శృతిహాస‌న్ కాల్షీట్లు దొర‌క‌డం కాస్త క‌ష్టంగా ఉంద‌ట‌.

 

ప్రస్తుతం శృతిహాసన్ చాలా బిజీగా మారిపోయింది. ఇంత బిజీ టైమ్ లో కూడా దిల్ రాజు మాట కాద‌న‌లేక ఈ సినిమాలో చేయ‌డానికి ఒప్పుకుంద‌ట‌. అయితే ఈమె షూటింగ్ మొత్తం ఏప్రిల్ రెండో వారం నుంచి వకీల్ సాబ్ కు కాల్షీట్లు కేటాయించింది. అయితే అస‌లు చిక్కంతే ఇక్క‌డే ఉంది.

 

అదేంటి అనుకుంటున్నారా...శృతి డేట్స్ ఇచ్చిందిగా అనుకుంటున్నారా అయితే ఆ టైమ్ కు పవన్ ను లొకేషన్ కు తీసుకురావడం ఎలా అని యూనిట్ టెన్ష‌న్ ప‌డుతోంద‌ట‌. ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగ్స్ అన్నీ ఆపేసిన విష‌యం తెలిసిందే. మ‌రి ఏప్రిల్ రెండో వారానికి పరిస్థితి ఎలా ఉంటుంది కాస్త కుదుట‌ప‌డుద్దా లేదా అని నిర్మాత‌లు టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గి, పరిస్థితి మెరుగైనా ఆ టైమ్ కు పవన్ కాల్షీట్లు దొరుకుతాయో… దొరకవో… అనేది ఇప్పుడు మరో సమస్య. దీంతో దిల్ రాజు తెగ సతమతమౌతున్నాడు.

 

కేవలం ఈ కాల్షీట్ల సమస్య కారణంగానే శృతిహాసన్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించ‌డానికి ఆలోచిస్తున్నారు దిల్‌రాజు. పవన్ కాల్షీట్ల పై క్లారిటీ వచ్చి, కరోనా ప్రభావం తగ్గిన వెంటనే శృతిహాసన్ ఎంట్రీని అఫీషియల్ గా ప్రక‌టిద్దామ‌ని అనుకుంటున్నార‌ట‌. మొత్తానికి ఈ క‌రోనా ఎఫెక్ట్ టోట‌ల్ ప్ర‌పంచాన్నే ఓఊపు ఊపేస్తుందిగా. ఇక ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా వ‌రుస సినిమాల‌కు సైన్ చేసి ఉన్నారు. ఆయ‌న ఇటు సినిమాల‌తోనూ అటు రాజ‌కియాల‌తోనూ ఫుల్ బిజీగా ఉన్నార‌ట‌. మ‌రి త్వ‌ర త్వ‌ర‌గా ఆయ‌న వ‌కీల్‌సాబ్ పూర్తి చేసి మ‌రో షూటింగ్ కి వెళ్ళి పోవాల‌ని ఆలోచిస్తుంటే మ‌ధ్య‌లో ఈ క‌రోనా వ‌ల్ల బ్రేక్ ప‌డింది. ఇక ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటో అటు ప‌వ‌న్‌కి ఇటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి ప్ర‌శ్నార్ధంగా మారింది. ఏం చేయాలో కూడా అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొనింది.

మరింత సమాచారం తెలుసుకోండి: