సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. తరువాత కొరాటల దర్శకత్వంలోనే తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ బగా నిర్మాణ సంస్థ. హ్యాట్రిక్ సినిమాగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలంతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ నే అందుకుంది. భారీ చిత్రాలు నిర్మిస్తూనే మీడియం రేంజ్ సినిమాలు కూడా నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్.
అయితే రంగస్థలం తరువాత భారీ హిట్ ఒక్కటి కూడా ఈ బ్యానర్ లో రాలేదు. వరసగా సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటొని సినిమాలు డిజాస్టర్ లు అయ్యాయి. చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించినా తరువాత డియర్ కామ్రేడ్ సినిమా మరోసారి నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ బ్యానర్ వరుసగా మెగా హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాను నిర్మిస్తోంది.
సుకుమార్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా తో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమాను కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది. తాజాగా మరో మెగా హీరోతోనూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉంది. మెగాస్టార్ తదుపరి చిత్రాన్ని మైత్రీ మూమీ మేక్సర్స్ సంస్థ నిర్మించనుంది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను కూడా మైత్రీ సంస్థే నిర్మించనుంది. ఇలా వరుసగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వరుస విజయాల మీద కన్నేసింది.