సౌత్‌ ఇండియా స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం చోటుచేసుకొన్నది. ఈయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ కన్నుమూసారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం  తుదిశ్వాస విడిచారు. దాంతో రత్నవేలు కుటుంబం విషాదానికి లోనైంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు రత్నవేలు ఇంటికి పయనం అవుతున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న రత్నవేలుకు మ‌రియు ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈమె అంత్యక్రియలు మార్చ్ 21నే జరగనున్నాయి.

 

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సినిమాటోగ్రఫర్ రత్నవేలు. రత్నవేలు చిరంజీవి, రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ చిత్రాలకి సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. అలాగే ముఖ్యంగా  రంగస్థలం సినిమా ఆయనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. సుకుమార్ దర్శకత్వం, చరణ్ నటన, సమంత హావభావాలతో పాటు రత్నవేలు సినిమాటోగ్రఫీ పనితీరును కూడా పలువురు మెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ టైమ్‌లోనే  రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి రామన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

 

తల్లి ఆరోగ్యం క్షీణించిందనే వార్త అందడంతో ర‌త్న‌వేలు రంగస్థలం ప్రమోషన్స్ నుంచి హుటాహుటిన చెన్నైకి వెళ్లిపోయారు. దీంతో రంగస్థలం సినిమా ప్రమోషన్స్ దూరంగా ఉన్నారు. మ‌ళ్లీ ఇటీవ‌ల జ్ఞానేశ్వరి అనారోగ్యానికి గురవ్వడంతో ఆమెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక నేడు చికిత్స పొందుతూ జ్ఞానేశ్వరి తుది శ్వాస విడిచారు. కాగా, ఎప్పుడూ వరస సినిమాలతో బిజీగా ఉంటాడు సినిమాటోగ్రఫర్ రత్నవేలు. అయితే ఒక జోనర్ సినిమాలకు పరిమితం కాకుండా ఆయన ఎప్పుడూ విభిన్నమైన చిత్రాలకు పనిచేస్తుంటారు. 

 

అలా  ఖైదీ నెం150, సైరా, రంగస్థలం, రోబో, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు కూడా పనిచేశారు. మ‌రియు సుకుమార్‌ దర్శకత్వం వహించే అన్ని సినిమాలకు రత్నవేలే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: